రామ్ చరణ్ ‘ఆచార్య’ కోసం ‘సిద్ధ’ అవతారం ఎత్తి మూడు రోజులే అయింది. ‘ఆచార్య’ సెట్స్లోకి అతడికి స్వాగతం పలుకుతూ దర్శకుడు కొరటాల శివ మెడలో రుద్రాక్ష మాలతో ఉన్న చరణ్ చిత్రాన్ని వెనుక నుంచి షేర్ చేశాడు. ఈ సినిమా కోసం చరణ్ స్పెషల్ లుక్లోకి మారినట్లే కనిపించింది ఆ ఫొటో చూస్తే. ఈ సినిమా దేవాలయాల పరిరక్షణ నేపథ్యంలో సాగే సినిమా అని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి.
సినిమా చిత్రీకరణ కూడా ఎక్కువగా టెంపుల్ సెట్ నేపథ్యంలోనే సాగుతోందన్నదీ స్పష్టం. చరణ్ క్యారెక్టర్, లుక్ పరంగా ‘ఆధ్యాత్మిక’ కోణం ఉంటుందని తెలుస్తోంది. మొన్న రిలీజ్ చేసిన లుక్ కూడా ఈ దిశగా సంకేతాలు ఇచ్చింది. కొత్త లుక్ కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి బ్రేక్ తీసుకుని చరణ్ ‘ఆచార్య’ కోసం పని చేస్తున్నట్లే అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఇంతలో రాజమౌళి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైందని.. సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. వైరల్ అయిన ఈ ట్వీట్ మెగా అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఈ మధ్యే ‘ఆచార్య’ షూట్కు వచ్చిన చరణ్.. ఇంతలో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి ఎలా అడుగు పెట్టాడన్నది వాళ్ల డౌట్. క్లైమాక్స్ చిత్రీకరణ అంటే భారీ స్థాయిలోనే ఉంటుంది. నిర్విరామంగా చిత్రీకరణ జరుగుతుంది. కంటున్యుటీ అన్నది చాలా కీలకమైన విషయం. అలాంటపుడు చరణ్ ‘ఆచార్య’ షూటింగ్లోనూ ఎలా పాల్గొంటాడన్నది అర్థం కాని విషయం.
‘ఆర్ఆర్ఆర్’ ఏమో వందేళ్ల వెనుకటి నేపథ్యంలో సాగే కథ. ‘ఆచార్య’ వర్తమానం సాగే స్టోరీ. మహా అయితే కొన్నేళ్లు వెనక్కి వెళ్తారు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’లా శతాబ్దం అయితే వెనక్కి వెళ్లే అవకాశం లేదు. అలాంటపుడు ఈ రెండు చిత్రాల్లో చరణ్ ఒకేసారి నటిస్తూ లుక్, కాల్ షీట్స్, ఇతర విషయాల్లో ఎలా మేనేజ్ చేయగలుగుతాడో అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
This post was last modified on January 20, 2021 5:27 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…