ఈ ఏడాది తెలుగు నుంచి అత్యధిక అంచనాలతో రాబోతున్న సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. ‘రంగస్థలం’తో సుకుమార్, ‘అల వైకుంఠపురములో’తో అల్లు అర్జున్ నాన్-బాహుబలి హిట్లు కొట్టాక కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇద్దరి కెరీర్లో ఇది తొలి పాన్ ఇండియా మూవీ కూడా. ఇప్పటికే ఈ చిత్రానికి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. మధ్యలో బ్రేక్ పడ్డ షెడ్యూల్ను పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్రస్తుతం మారేడు మిల్లిలో ఉంది. రేయింబవళ్లు తేడా లేకుండా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
ఇప్పుడు జరిగే షెడ్యూల్ అంతా అయ్యేసరికి సగం సినిమా పూర్తయిపోతుందట. ఐతే ఇప్పటిదాకా ఈ చిత్రానికి విలన్ మాత్రం ఖరారవ్వలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరే విలన్ పాత్ర ప్రవేశిస్తుందని.. కాబట్టి అప్పటిదాకా విలన్ పాత్రతో పని లేదు కాబట్టి ఇంకా ఆ క్యారెక్టర్ ఎవరు చేయాలన్నదానిపై ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు.
ఈ షెడ్యూల్ అయ్యే సమయానికి మాత్రం సుకుమార్ ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఇప్పటిదాకా విజయ్ సేతుపతి, బాబీ సింహా, అరవింద్ స్వామి.. ఇలా చాలా పేర్లు వినిపించాయి ఈ పాత్ర విషయంలో. కాగా ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పేరు తెరపైకి వచ్చింది. పాన్ ఇండియా మూవీ అయిన ‘పుష్ప’ను హిందీలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని బాలీవుడ్ విలన్ అయితే బాగుంటుందని యోచిస్తున్నారట.
మరీ పెద్ద నటులైతే బన్నీని డామినేట్ చేస్తారని భావించి మీడియం రేంజిలో బాబీ డియోల్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. విలన్ది పోలీస్ పాత్ర అని, ఆ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఐతే ఓ పట్టాన ఏదీ తేల్చని సుకుమార్.. బాబీని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నాడు తప్ప అతను ఖరారైనట్లు కాదని.. ఆయన మనసులో ఏముందో చిత్ర బృందంలోని వారికి కూడా స్పష్టంగా తెలియదని అంటున్నారు.
This post was last modified on January 18, 2021 7:08 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…