మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్ లో ఉండిపోయింది. ముందు నుంచి ప్రియమణి పేరు వినిపించింది కానీ తాజాగా ఆ స్థానాన్ని స్నేహకు ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. వినయ విధేయ రామలో రామ్ చరణ్ వదినగా నటించిన తర్వాతా ఆవిడ కనిపించిన దాఖలాలు చాలా అరుదు. అందులోనూ చెన్నైలోనే ఉండటంతో అదే పనిగా తెలుగు సినిమాలు చేయడం తక్కువగా ఉండేది.
చిరుతో నటించాలని తను ఎన్నేళ్ల నుంచో కలగా భావిస్తున్న కోరిక ఈ రూపంలో తీరిందన్న మాట. అంటే కాకా భార్యగా స్నేహను చూడబోతున్నామని అర్థం చేసుకోవచ్చు. ఇందులో చిరంజీవి పాత్ర వాల్తేర్ వీరయ్య లాగా రెగ్యులర్ షేడ్స్ లో హీరోయిన్ తో డాన్స్ చేసే తరహాలో ఉండదు. డాక్టర్ చదివే వయసున్న అనస్వర రాజన్ తండ్రిగా వయసుకు తగ్గట్టు డిజైన్ చేశారు బాబీ. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ అందులోనూ గ్లామర్ కోటింగ్ లాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారట.
సో కొంచెం టైం పట్టినా మంచి ఆప్షనే అనుకోవాలి. దీనికి సంబంధించి కెవిఎన్ ప్రొడక్షన్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. సంక్రాంతి విడుదలను టార్గెట్ గా చేసుకుని పరుగులు పెడుతున్న కాకాకు అనుకోకుండా విశ్వంభర రూపంలో స్పీడ్ బ్రేకర్ పడింది. అది కూడా పండక్కు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో చిరంజీవి ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తోంది.
ఒకవేళ తప్పుకోవాల్సి వస్తే మటుకు కాకా 2027 వేసవికి వెళ్ళిపోతుంది. రెండింటి మధ్య కనీసం మూడు నాలుగు నెలలు గ్యాప్ ఉండటం సబబు కాబట్టి అలా చేయక తప్పదు. తమన్ సంగీతం సమకూరుస్తున్న కాకాలో అధిక భాగం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. గ్యాంగ్ స్టర్ నేపధ్యమే అయినా ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ తో పాటు అభిమానులు కోరుకునే మాస్ అంశాలు అన్నీ పొందుపరిచినట్టు తెలిసింది. విడుదల తేదీ తేలడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు.
This post was last modified on September 17, 2026 10:55 am
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్కు అమెరికా నుంచి మరో టారిఫ్ ముప్పు దగ్గరైంది. రష్యాపై మరింత ఆర్థిక…
ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు.…
ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవికి చెందిన భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ…