నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా ఉన్నారని కాదు. నెగటివ్ కామెంట్స్ చేసినవాళ్లు లేకపోలేదు. అయితే వాటిలో అధిక శాతం ఉద్దేశపూర్వకంగా విజయ్ దేవరకొండని టార్గెట్ చేసిన వైనం కనిపిస్తోంది. రాయలసీమ యాసని తను పలికే తీరు గురించి మొదట్లో కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే టీజర్లో వాటికి క్లారిటీ వచ్చేసింది. పొరపాట్లు లేకుండా సీమ భాషని డెలివరీ చేశాడు విజయ్.
ఇంకొందరు పోలికల పర్వానికి తెరతీశారు. నాగార్జున రాజన్న, చిరంజీవి సైరా నరసింహారెడ్డితో మొదలుపెట్టి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం వచ్చిన అల్లూరి సీతారామరాజు వరకు వెళ్ళిపోయి ఏవేవో కంపారిజన్లు చేస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందు నేపధ్యాన్ని ఎవరు తీసుకున్నా సినిమాలోని వాతావరణం ఒకేలా కనిపిస్తుంది. అందులో మేజిక్ చేయడానికి ఏముండదు. ఇంద్రలోకం, నరకం అంటే ఒక టెంప్లేట్ ఎలా ఫాలో అవుతాయో ప్రీ ఇండిపెండెన్స్ కు కూడా అదే వర్తిస్తుంది.
దీన్ని సరిగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు చూపించే సెన్సిబిలిటీస్ మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వెంకటేష్ హీరోగా రాఘవేంద్రరావు సుభాష్ చంద్రబోస్ తీశారు. దారుణంగా పోయింది. గతం వర్తమానాన్ని సరిగ్గా బాలన్స్ చేయలేక ఫెయిలయ్యారు. సైరాలో అలాంటి పొరపాట్లు లేవు కాబట్టే ఫ్లాప్ కాకుండా గట్టెక్కింది. ప్రభాస్ ఫౌజీలోనూ ఈ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. షూటింగ్ టైం నుంచే దీని మీద ఎంత పాజిటివ్ బజ్ ఉందో కళ్లారా చూస్తున్నాం.
సో విజయ్ దేవరకొండని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల రణబాలికి వచ్చిన నష్టం ఏమి లేదు. విషయం ఉంటే ఎవరు ఆపాలని చూసినా సినిమా ఆగదు. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ లో రష్మిక మందన్న భార్య పాత్రనే పోషించడం గమనార్హం. అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలికి పోటీగా రజినీకాంత్ జైలర్ 2 ఉంది. వారం ముందు వెంకటేష్ ఆదర్శ కుటుంబం వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం.
This post was last modified on September 10, 2026 11:47 am
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…