ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న వైనం తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయట పడింది. ఇది సహజం. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి, 90స్ మిడిల్ క్లాస్ తీసిన తర్వాత వచ్చిన మంచి పేరు ఆధారంగా చేసుకుని ఎపిక్ లో ఏదేదో ఊహించుకున్న ఆడియన్స్ కు అందులో కొంచెం బోల్డ్ కంటెంట్ కనిపించేసరికి సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి ఖంగారు పడాల్సిన పని లేదు.
ఎందుకంటే ఆదిత్య హాసన్ చెప్పిన సందీప్ రెడ్డి వంగ ఉదాహరణే తీసుకుంటే అర్జున్ రెడ్డి పోస్టర్ మీదే అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. కొన్ని సంఘాల వాళ్ళు వాటి మీద నిరసన కూడా వ్యక్తం చేశారు. కానీ అవేవి సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి. బ్లాక్ బస్టర్ సాధించింది. ఎపిక్ ఆ స్థాయికి వెళ్తుందా లేదానేది కాదు ఇక్కడ ప్రశ్న. జనాలు ఏమనుకుంటారో అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే రిలీజ్ రోజు ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంటే. అది ఉంటే ఎవరూ సక్సెస్ ని ఆపలేరు.
అయితే నిర్మాత నాగవంశీ కూడా ట్రైలర్, క్లైమాక్స్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం చూస్తే ముందే ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎంత న్యూ ఏజ్ లవ్ డ్రామా అయినా తెలుగు ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా ఉంటేనే హిట్టు దక్కుతుంది. ముగింపు ఎలా ఉన్నా,. రొమాన్స్ ఎంత పెట్టినా పాస్ అవ్వొచ్చు. ఆదిత్య హాసన్ కున్న బ్రాండ్ వల్ల ఇప్పుడొచ్చిన సెన్సార్ ఏ సర్టిఫికెట్ చర్చగా మారింది కానీ లేదంటే ఈ డిస్కషన్ ఉండేది కాదేమో.
పెద్ది నుంచి ఇరుముడి దాకా దాదాపు అన్ని సినిమాలు మాస్, ఫ్యామిలీస్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుని వచ్చి ఘనవిజయాలు అందుకున్నాయి. ప్రత్యేకంగా యువతను లక్ష్యంగా పెట్టుకున్న ఎపిక్ కనక వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఉండి, జెన్ జీ బ్యాచ్ కు కనెక్ట్ అయితే మటుకు రిజల్ట్ గురించి టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఆ మాటకొస్తే నెగటివిటీ ఉండటం కూడా ఒకరకంగా మంచిదే. ఏంన్దరో లెజెండరీ ఫిలిం మేకర్స్ కూడా దీన్ని అనుభవించిన వాళ్లే.
This post was last modified on September 8, 2026 10:16 pm
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…
భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…
థియేటర్ల దగ్గర టాక్సిక్ కథ ముగిసిపోయింది కానీ దాని కథలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సర్దార్ దర్శకుడు మిత్రన్…