అల్లు వారి ఆహా ఓటీటీ దూకుడు మీదుంది. తెలుగులో ఈ ఓటీటీ లాగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను మరే ఫ్లాట్ ఫామ్ కూడా రిలీజ్ చేయట్లేదు. ప్రతి వారం కొత్త కంటెంట్ ఇస్తూ సబ్స్క్రైబర్లను నిలుపుకోవడానికి, పెంచుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది ఆహా.
సంక్రాంతి కానుకగా ఆహాలో మెయిల్ అనే చిన్న సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వస్తోంది. వచ్చే వారానికి కూడా ఆహా ఓ కొత్త సినిమాను రెడీ చేసేసింది. ఆ సినిమా పేరు.. సూపర్ ఓవర్. చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను పూర్తి చేసేసింది చిత్ర బృందం. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ సినిమాలో భాగస్వాములు అయ్యారు.
నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ సూపర్ ఓవర్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఆయన శిష్యుడు ప్రవీణ్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీని స్నీక్ పీక్ను హీరో శర్వానంద్ తాజాగా రిలీజ్ చేశాడు. ఒక భారీ దొంగతనం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇద్దరు కుర్రాళ్లు, ఓ అబ్బాయి కలిసి పోలీస్ స్టేషన్కు దగ్గర్లోనే దొంగతనానికి ప్రణాళిక రచిస్తారు.
రిస్క్ చేస్తే తప్ప డబ్బులు రావని భావించిన హీరో తన ప్రేయసి, ఓ ఫ్రెండుతో కలిసి ఈ దొంగతనానికి సిద్ధపడతాడు. వాళ్ల ప్రణాళిక ఏంటి.. వీరికి పోలీసులు ఎలా అడ్డు పడ్డారు.. చివరికి ఎవరు పైచేయి సాధించారన్నది మిగతా కథ. సుధీర్ వర్మకు హీస్ట్ థ్రిల్లర్లంటే ఇష్టం. అతడి డెబ్యూ మూవీ స్వామి రారా, తర్వాతి సినిమా దోచేయ్ కూడా ఆ తరహావే. ఇప్పుడు అతడి శిష్యుడు కూడా ఆ తరహా సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి ఈ సూపర్ ఓవర్ ప్రేక్షకులను ఏమేర అలరిస్తుందో చూడాలి.
This post was last modified on January 17, 2021 11:06 am
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…