అల్లు వారి ఆహా ఓటీటీ దూకుడు మీదుంది. తెలుగులో ఈ ఓటీటీ లాగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను మరే ఫ్లాట్ ఫామ్ కూడా రిలీజ్ చేయట్లేదు. ప్రతి వారం కొత్త కంటెంట్ ఇస్తూ సబ్స్క్రైబర్లను నిలుపుకోవడానికి, పెంచుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది ఆహా.
సంక్రాంతి కానుకగా ఆహాలో మెయిల్ అనే చిన్న సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వస్తోంది. వచ్చే వారానికి కూడా ఆహా ఓ కొత్త సినిమాను రెడీ చేసేసింది. ఆ సినిమా పేరు.. సూపర్ ఓవర్. చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను పూర్తి చేసేసింది చిత్ర బృందం. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ సినిమాలో భాగస్వాములు అయ్యారు.
నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ సూపర్ ఓవర్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఆయన శిష్యుడు ప్రవీణ్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీని స్నీక్ పీక్ను హీరో శర్వానంద్ తాజాగా రిలీజ్ చేశాడు. ఒక భారీ దొంగతనం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇద్దరు కుర్రాళ్లు, ఓ అబ్బాయి కలిసి పోలీస్ స్టేషన్కు దగ్గర్లోనే దొంగతనానికి ప్రణాళిక రచిస్తారు.
రిస్క్ చేస్తే తప్ప డబ్బులు రావని భావించిన హీరో తన ప్రేయసి, ఓ ఫ్రెండుతో కలిసి ఈ దొంగతనానికి సిద్ధపడతాడు. వాళ్ల ప్రణాళిక ఏంటి.. వీరికి పోలీసులు ఎలా అడ్డు పడ్డారు.. చివరికి ఎవరు పైచేయి సాధించారన్నది మిగతా కథ. సుధీర్ వర్మకు హీస్ట్ థ్రిల్లర్లంటే ఇష్టం. అతడి డెబ్యూ మూవీ స్వామి రారా, తర్వాతి సినిమా దోచేయ్ కూడా ఆ తరహావే. ఇప్పుడు అతడి శిష్యుడు కూడా ఆ తరహా సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి ఈ సూపర్ ఓవర్ ప్రేక్షకులను ఏమేర అలరిస్తుందో చూడాలి.
This post was last modified on January 17, 2021 11:06 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…