అల్లు వారి ఆహా ఓటీటీ దూకుడు మీదుంది. తెలుగులో ఈ ఓటీటీ లాగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను మరే ఫ్లాట్ ఫామ్ కూడా రిలీజ్ చేయట్లేదు. ప్రతి వారం కొత్త కంటెంట్ ఇస్తూ సబ్స్క్రైబర్లను నిలుపుకోవడానికి, పెంచుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది ఆహా.
సంక్రాంతి కానుకగా ఆహాలో మెయిల్ అనే చిన్న సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వస్తోంది. వచ్చే వారానికి కూడా ఆహా ఓ కొత్త సినిమాను రెడీ చేసేసింది. ఆ సినిమా పేరు.. సూపర్ ఓవర్. చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను పూర్తి చేసేసింది చిత్ర బృందం. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ సినిమాలో భాగస్వాములు అయ్యారు.
నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ సూపర్ ఓవర్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఆయన శిష్యుడు ప్రవీణ్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీని స్నీక్ పీక్ను హీరో శర్వానంద్ తాజాగా రిలీజ్ చేశాడు. ఒక భారీ దొంగతనం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇద్దరు కుర్రాళ్లు, ఓ అబ్బాయి కలిసి పోలీస్ స్టేషన్కు దగ్గర్లోనే దొంగతనానికి ప్రణాళిక రచిస్తారు.
రిస్క్ చేస్తే తప్ప డబ్బులు రావని భావించిన హీరో తన ప్రేయసి, ఓ ఫ్రెండుతో కలిసి ఈ దొంగతనానికి సిద్ధపడతాడు. వాళ్ల ప్రణాళిక ఏంటి.. వీరికి పోలీసులు ఎలా అడ్డు పడ్డారు.. చివరికి ఎవరు పైచేయి సాధించారన్నది మిగతా కథ. సుధీర్ వర్మకు హీస్ట్ థ్రిల్లర్లంటే ఇష్టం. అతడి డెబ్యూ మూవీ స్వామి రారా, తర్వాతి సినిమా దోచేయ్ కూడా ఆ తరహావే. ఇప్పుడు అతడి శిష్యుడు కూడా ఆ తరహా సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి ఈ సూపర్ ఓవర్ ప్రేక్షకులను ఏమేర అలరిస్తుందో చూడాలి.
This post was last modified on January 17, 2021 11:06 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…