రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతుంది. వైసీపీ అధికారం కోల్పోయి కూడా రెండున్నరేళ్ళయ్యింది. అయినా ఇప్పటికీ వైసీపీ కోలుకోలేదు. ఓటమికి కారణాలు అన్వేషించకుండా రకరకాల ఆరోపణలతో కాలం వెళ్ళబుచ్చుతుంది. ఓటమి తర్వాత కూడా అధినేత జగన్ లో మార్పు రాలేదని ఆ పార్టీ శ్రేణులు లోలోన కుమిలి పోతున్నారు. అధినాయకుడు పట్టించుకోడు, స్థానిక నాయకులు బయటకు రావడం లేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అదే మాట చెబుతున్నాడు వైసీపీ ఆస్థాన ‘ సర్వే’ యర్ ఆరా మస్తాన్. ఇటీవల విడుదలైన మూడ్ ఆఫ్ సర్వే నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా వైసీపీ బలహీనంగా వుందని చెప్పిన ఆయన మొత్తం 175 నియోజకవర్గాల్లోని 70 స్థానాల్లో సరైన ఇంచార్జిలు లేరని కేవలం 60 నియోజకవర్గాల్లో మాత్రమే సరైన అభ్యర్థులు వున్నారని కుండబద్దలు కొట్టారు. వారిలో చాలా మంది హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారని తెలిపారు.
పార్టీ నాయకత్వం నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కేడర్లో తీవ్ర అసంతృప్తి వుందని, కొంతమంది కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. పార్టీ అధినేత జగన్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తలతోనైనా సమావేశాలు పెట్టి మాట్లాడితే బాగుంటుందని కొందరు పార్టీ నాయకులు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సమాచారం అధినేతకు చేరవేసే దారులు వెదుకుతున్నారని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే పార్టీ అధినేత జగన్ కు వున్న ఇమేజ్, చరిష్మా మీదనే పార్టీ నడుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ నాయకత్వ స్థాయిలో లోపాలు సరిదిద్దుకోకపోతే క్షేత్ర స్థాయిలో నష్టం జరుగుతుందని వివరించారు. పార్టీకి బలమైన లీడర్షిప్, కేడర్ చాలా అవసరమన్నారు. జగన్ ఒంటరి పోరాటం మీదనే ఆధారపడితే నష్టం తప్పదని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అది వ్యతిరేకతగా మారలేదని విశ్లేషించారు. ఇంకా మూడేళ్ల సమయం వుందని, అప్పటి పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయడం సరికాదన్నారు. సర్వేలు చూసి వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటే తప్పులో కాలేసినట్టవుతుందని హెచ్చరించారు. కూటమికి నేతృత్వం వహిస్తున్న టీడీపీకి బలమైన కేడర్ వుందని, దాన్ని ఢీ కొట్టడం అంత ఈజీ కాదన్నారు. ఆరా మస్తాన్ చేసినట్లు చెబుతున్న ఈ వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ గెలుస్తుందని సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on August 29, 2026 2:43 pm
వాయిదాల పుకార్లు ఎన్ని తిరుగుతున్నా మా పని మాదే అన్న తరహాలో దసరా విడుదలని టార్గెట్ చేసుకున్న రెండు ప్యాన్…
ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.…
సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…
బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…