Political News

70 స్థానాల్లో వైసీపీకి సరైన ఇంచార్జీలు లేరా?

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతుంది. వైసీపీ అధికారం కోల్పోయి కూడా రెండున్నరేళ్ళయ్యింది. అయినా ఇప్పటికీ వైసీపీ కోలుకోలేదు. ఓటమికి కారణాలు అన్వేషించకుండా రకరకాల ఆరోపణలతో కాలం వెళ్ళబుచ్చుతుంది. ఓటమి తర్వాత కూడా అధినేత జగన్ లో మార్పు రాలేదని ఆ పార్టీ శ్రేణులు లోలోన కుమిలి పోతున్నారు. అధినాయకుడు పట్టించుకోడు, స్థానిక నాయకులు బయటకు రావడం లేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

అదే మాట చెబుతున్నాడు వైసీపీ ఆస్థాన ‘ సర్వే’ యర్ ఆరా మస్తాన్. ఇటీవల విడుదలైన మూడ్ ఆఫ్ సర్వే నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా వైసీపీ బలహీనంగా వుందని చెప్పిన ఆయన మొత్తం 175 నియోజకవర్గాల్లోని 70 స్థానాల్లో సరైన ఇంచార్జిలు లేరని కేవలం 60 నియోజకవర్గాల్లో మాత్రమే సరైన అభ్యర్థులు వున్నారని కుండబద్దలు కొట్టారు. వారిలో చాలా మంది హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారని తెలిపారు.

పార్టీ నాయకత్వం నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కేడర్లో తీవ్ర అసంతృప్తి వుందని, కొంతమంది కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. పార్టీ అధినేత జగన్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తలతోనైనా సమావేశాలు పెట్టి మాట్లాడితే బాగుంటుందని కొందరు పార్టీ నాయకులు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సమాచారం అధినేతకు చేరవేసే దారులు వెదుకుతున్నారని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే పార్టీ అధినేత జగన్ కు వున్న ఇమేజ్, చరిష్మా మీదనే పార్టీ నడుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ నాయకత్వ స్థాయిలో లోపాలు సరిదిద్దుకోకపోతే క్షేత్ర స్థాయిలో నష్టం జరుగుతుందని వివరించారు. పార్టీకి బలమైన లీడర్షిప్, కేడర్ చాలా అవసరమన్నారు. జగన్ ఒంటరి పోరాటం మీదనే ఆధారపడితే నష్టం తప్పదని హెచ్చరించారు.

కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అది వ్యతిరేకతగా మారలేదని విశ్లేషించారు. ఇంకా మూడేళ్ల సమయం వుందని, అప్పటి పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయడం సరికాదన్నారు. సర్వేలు చూసి వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటే తప్పులో కాలేసినట్టవుతుందని హెచ్చరించారు. కూటమికి నేతృత్వం వహిస్తున్న టీడీపీకి బలమైన కేడర్ వుందని, దాన్ని ఢీ కొట్టడం అంత ఈజీ కాదన్నారు. ఆరా మస్తాన్ చేసినట్లు చెబుతున్న ఈ వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ గెలుస్తుందని సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే.

This post was last modified on August 29, 2026 2:43 pm

Share

Recent Posts

ఆదర్శ కుటుంబానికి రీమిక్స్ సమస్యా?

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల ఇంకో ముప్పై రెండు రోజుల్లో…

14 minutes ago

మాస్ బ్యాటింగ్.. ఇక్కడ ఇరుముడి… అక్కడ అది

గత మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి జోష్ మీద నడుస్తోంది. కనీసం రెండు వారాలకో మంచి సినిమా పడుతోంది.…

2 hours ago

సజ్జలపై సంచలన ఆరోపణలు చేసిన సాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. తనకు రాజకీయ పునాదులు వేసిన వైసిపి పార్టీలో జరిగిన…

2 hours ago

ఆమిర్‌ ఖాన్‌… అవసరం లేని సినిమా

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్నాడు ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దే బసంతి, 3…

2 hours ago

వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…

5 hours ago

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…

5 hours ago