నిన్న విడుదలైన టాక్సిక్ మొదటి రోజు 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్షేత్ర స్థాయి నెంబర్లు కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో కానీ భారీ ఓపెనింగ్ దక్కిన మాట వాస్తవం. నిన్న దాదాపు అడ్వాన్స్ బుకింగ్ మీద అత్యధిక శాతం షోలు ఆక్యుపెన్సీ తెచ్చుకున్నాయి. అంటే షో సమయానికి టికెట్లు దొరుకుతాయో లేదోనని మొదటిరోజే చూడాలన్న సంకల్పంతో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు భారీగా కొనేశారు. నార్త్ లో రెస్పాన్స్ ఎక్కువగా ఉంది.
టాక్ ఎలా ఉందనేది పక్కనపెడితే ఫైనల్ గా ఎక్కడికి వెళ్తుందనేది ఆదివారానికి క్లారిటీ రావొచ్చు. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టాక్సిక్ బృందం మాత్రం తమది స్లో పాయిజన్ తరహాలో ఎక్కేస్తుందని ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా కెజిఎఫ్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరీ టాక్సిక్ కోసం కష్టపడిన యష్ కు దానికి తగ్గ ఫలితం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే గ్రోన్ ఆప్స్ స్టోరీ పేరుతో ఫ్యామిలీస్ కి దూరం కావడం కొంత ప్రభావం చూపించింది.
ఒక్కటి మాత్రం నిజం. యష్ కి గ్రౌండ్ లెవెల్ లో అభిమాన గణం చాలా బలంగా ఉంది. కర్ణాటకలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఏపీ తెలంగాణలో సైతం ఉదయం ఆరు గంటల షోలు హౌస్ ఫుల్ కావడం తేలిగ్గా చూసే విషయం కాదు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కి జనాల్లో ఎలాంటి బ్రాండ్ లేకపోయినా కెవిఎన్ సంస్థ భారీ నిర్మాణం, కెజిఎఫ్ రూపంలో యష్ సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ అండగా నిలబడి ఇంత పెద్ద నెంబర్లు వచ్చేలా చేశాయి. ఇది నిలబడటం కీలకం.
పెద్ద స్థాయికి వెళ్లిన యష్ లాంటి హీరోలు ఇకపై అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకోవడం అవసరం అనిపిస్తోంది. యాక్షన్ వయొలెన్స్ ఒకటే ఆడియన్స్ వీళ్ళ నుంచి కోరడం లేదు. రామ్ చరణ్ పెద్ది చేసింది అందుకే. దేవరలో ఉన్న సముద్ర నేపధ్యమే జూనియర్ ఎన్టీఆర్ ని కొరటాలకు ఓకే చెప్పేలా చేసింది. ప్రభాస్ సైతం ఒకదానితో మరొకటి సంబంధం లేని కథలను ఎంచుకున్నాడు. యష్ కూడా ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటే కెరీర్ లో అద్భుతాలు చూడొచ్చు.
This post was last modified on August 27, 2026 7:13 pm
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…