ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ టీచర్ ని నెగటివ్ గా చూపించారని, అంతే కాకుండా పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు తమ స్కూళ్లలోనే ఉన్నట్టు తప్పు అర్థం వస్తోందని, వీటిని వెంటనే సవరించడమో లేదా తీసేయడమో చేయాలని డిమాండ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రిలీజైన నాలుగు రోజుల తర్వాత ఈ అబ్జెక్షన్ రావడం గమనార్హం. టీమ్ ఇంకా స్పందించలేదు.
ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇందులో తీవ్రంగా తప్పు బట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఇరుముడిలో చూపించింది ఒక చిన్న ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్. అక్కడ జరిగిన కల్పిత ఘటనల ఆధారంగా శివ నిర్వాణ కథ రాసుకున్నారు. అంతే తప్ప రాష్ట్రం మొత్తం స్కూల్ పిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం కాదు డైరెక్టర్ ఉద్దేశం. అది అర్థం చేసుకోకుండా ఇలా వివాదం చేయడం భావ్యం కాదని రవితేజ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇందులో లాజిక్ లేకపోలేదు.
ఉదాహరణకు ఒక పోలీస్ ని విలన్ గా చూపించినంత మాత్రం డిపార్ట్ మెంట్ మొత్తం అలా ఉంటుందని ఎవరూ చెప్పరు. జడ్జీలను సైతం నెగటివ్ షేడ్స్ లో చూపించిన సినిమాలు బోలెడున్నాయి. రాజకీయ నాయకుల సంగతి సరేసరి. అలాంటప్పుడు ఒక టీచర్ ని అలా ప్రొజెక్ట్ చేసినంత మాత్రం మొత్తం వ్యవస్థకు వర్తించదు. ఆ మాటకొస్తే ఈ మధ్య కాలంలో కొందరు కీచక టీచర్లు చేసిన ఘోరాల గురించి మీడియాలో చదువుతున్నాం, చూస్తున్నాం. ఇది అందరికీ తెలిసిందే.
ఇప్పుడీ వివాదం ఇరుముడిని ఇబ్బంది పెడుతుందా అంటే ఆ ఛాన్స్ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు శివ నిర్వాణ నుంచి సహేతుకమైన వివరణ వస్తుందని రవితేజ ఫాన్స్ భావిస్తున్నారు. పైన చెప్పిన లాజిక్స్ వివరించినా చాలు. టాక్సిక్ వల్ల థియేటర్ కౌంట్ తగ్గిపోతుందని ఒకపక్క అభిమానులు టెన్షన్ పడుతున్న టైంలో ఇప్పుడీ టీచర్ కాంట్రావర్సి రావడం ఊహించని పరిణామం. వీటి సంగతి ఎలా ఉన్నా వంద కోట్లు దాటేసి ఇంకో యాభై పైన కన్నేసిన ఇరుముడి అది కూడా సాధించేలా ఉంది.
This post was last modified on August 25, 2026 11:02 am
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…