ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్ లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు కోలుకున్నారని, ఇంకొంచెం వర్కౌట్స్ తో పాటు మందులు వేసుకుంటే ఇంకా త్వరగా మాములు మనిషి అవుతారని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పటికే బ్రేక్ వల్ల ఎన్బికె 111 వెయిటింగ్ లో ఉంది. ఆర్టిస్టుల డేట్లు వృథా కావడంతో మళ్ళీ సెట్ చేసే పనిలో దర్శకుడు గోపీచంద్ మలినేని బిజీగా ఉన్నారు.
ఏ తేదీ నుంచి బాలయ్య వస్తారనేది ఇంకొద్ది రోజుల్లో వెల్లడి కానుంది. ఇదిలా ఉండగా విడుదల విషయంలో యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. క్రిస్మస్ ని టార్గెట్ చేసుకుని డిసెంబర్ 24 రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయట. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఇరవై రోజుల స్పేస్ దొరుకుతుంది. అది కూడా ఎలాంటి చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేకుండా.
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలకు ఆ స్పేస్ చాలు. ఓవర్సీస్ పరంగా చూసుకుంటే షారుఖ్ ఖాన్ కింగ్, అవెంజర్స్ డూమ్స్ డే నుంచి కొంత ఇబ్బందులు తలెత్తినా బాలయ్య టార్గెట్ లోకల్ మార్కెట్లే కాబట్టి టెన్షన్ పడాల్సిన పని ఉండదు. అసలే సంక్రాంతి చాలా ప్యాక్ అయిపోయింది. చిరంజీవి కాకా, వెంకటేష్ జనవరి 12 విడుదల, శర్వానంద్ జార్జ్ క్రిష్, ప్రశాంత్ వర్మ మహాకాళి, సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు పక్కా డేట్లు వేసుకుని మరీ కాచుకుని ఉన్నాయి.
అంతా సవ్యంగా జరిగితే రవితేజ శ్రీవిష్ణు మల్టీస్టారర్ కూడా సంక్రాంతికే వస్తుంది. ఇన్ని సినిమాల మధ్య ఎన్బికె 111 వేసుకోవడం కంటే సోలోగా క్రిస్మస్ కు వచ్చేయడం ఉత్తమం. ఫ్యాన్స్ పండగే కావాలని డిమాండ్ చేస్తారు కానీ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించడం కూడా అవసరం. ఎంత హిట్ అయినా వీరసింహారెడ్డి, గౌతమిపుత్రశాతకర్ణి వాటి ఫుల్ పొటెన్షియల్ ని పోటీ కారణంగా చూపలేదనేది ట్రేడ్ అభిప్రాయం. మరి ఎన్బికె 111 బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on August 23, 2026 5:29 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…