మాస్ రాజా రవితేజ మళ్లీ ఫామ్లోకి వచ్చేశాడు. ఆయన కొత్త సినిమా ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి ఫలితాన్నే అందుకుంది. బంపర్ ఓపెనింగ్స్తో మొదలైన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసినట్లే.
ఈ ఉత్సాహంలో తన కొత్త చిత్రం ‘ఖిలాడి’ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవి రేసులో నిలబెట్టారు. సంక్రాంతి కానుగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి వేసవి విడుదలను ఖరారు చేశారు.
ఈ సందర్భంగానే ‘ఖిలాడి’ హీరోయిన్ల లెక్క కూడా తేలిపోయింది. మాస్ రాజా సరసన ఇద్దరు హాట్ బ్యూటీస్ను తీసుకున్నాడు రమేష్ వర్మ. ఆ ఇద్దరు.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి.
మీనాక్షి చౌదరి ఉత్తరాది అమ్మాయి. రెండేళ్ల కిందట ‘ఫెమీనా మిస్ గ్రాండ్’ పోటీల్లో విజేతగా నిలిచింది. మోడలింగ్లో మెరుపులు మెరిపించిన ఈ అమ్మాయి.. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఆ చిత్రమే.. ఇచట వాహనములు నిలపరాదు. సుశాంత్ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రం ముగింపు దశలో ఉంది. ఈ సినిమా విడుదల కాకముందే మీనాక్షి టాలెంట్ తెలిసి ఏకంగా రవితేజ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మీనాక్షి మోడల్గా ఉన్నప్పటి ఫొటో షూట్లు చూస్తే ఆమె సూపర్ హాట్ అన్న సంగతి తెలుస్తుంది. ఇక మరో భామ డింపుల్ హయతి గురించి చెప్పాలంటే ‘గద్దలకొండ గణేష్’ దగ్గరికి వెళ్లాలి.
ఆ చిత్రంలో సూపర్ హిట్టు నీ హైటు అంటూ మంచి మాస్ ఐటెం సాంగ్ చేసింది ఈ భామ. అందులో డింపుల్ ఎంత హాట్గా కనిపించిందో, ఆమె స్టెప్పులు ఎంతగా అలరించాయో తెలిసిందే. మొత్తానికి మాస్ రాజా సరసన ఇద్దరూ హాట్ భామల్నే తీసుకున్న రమేష్ వర్మ.. ఈ మాస్ సినిమాలో వాళ్ల అందాల్ని ఎలా ఎలివేట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on January 14, 2021 12:38 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…