మాస్ రాజా రవితేజ మళ్లీ ఫామ్లోకి వచ్చేశాడు. ఆయన కొత్త సినిమా ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి ఫలితాన్నే అందుకుంది. బంపర్ ఓపెనింగ్స్తో మొదలైన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసినట్లే.
ఈ ఉత్సాహంలో తన కొత్త చిత్రం ‘ఖిలాడి’ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవి రేసులో నిలబెట్టారు. సంక్రాంతి కానుగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి వేసవి విడుదలను ఖరారు చేశారు.
ఈ సందర్భంగానే ‘ఖిలాడి’ హీరోయిన్ల లెక్క కూడా తేలిపోయింది. మాస్ రాజా సరసన ఇద్దరు హాట్ బ్యూటీస్ను తీసుకున్నాడు రమేష్ వర్మ. ఆ ఇద్దరు.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి.
మీనాక్షి చౌదరి ఉత్తరాది అమ్మాయి. రెండేళ్ల కిందట ‘ఫెమీనా మిస్ గ్రాండ్’ పోటీల్లో విజేతగా నిలిచింది. మోడలింగ్లో మెరుపులు మెరిపించిన ఈ అమ్మాయి.. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఆ చిత్రమే.. ఇచట వాహనములు నిలపరాదు. సుశాంత్ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రం ముగింపు దశలో ఉంది. ఈ సినిమా విడుదల కాకముందే మీనాక్షి టాలెంట్ తెలిసి ఏకంగా రవితేజ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మీనాక్షి మోడల్గా ఉన్నప్పటి ఫొటో షూట్లు చూస్తే ఆమె సూపర్ హాట్ అన్న సంగతి తెలుస్తుంది. ఇక మరో భామ డింపుల్ హయతి గురించి చెప్పాలంటే ‘గద్దలకొండ గణేష్’ దగ్గరికి వెళ్లాలి.
ఆ చిత్రంలో సూపర్ హిట్టు నీ హైటు అంటూ మంచి మాస్ ఐటెం సాంగ్ చేసింది ఈ భామ. అందులో డింపుల్ ఎంత హాట్గా కనిపించిందో, ఆమె స్టెప్పులు ఎంతగా అలరించాయో తెలిసిందే. మొత్తానికి మాస్ రాజా సరసన ఇద్దరూ హాట్ భామల్నే తీసుకున్న రమేష్ వర్మ.. ఈ మాస్ సినిమాలో వాళ్ల అందాల్ని ఎలా ఎలివేట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on January 14, 2021 12:38 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…