ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల మెయిన్ థియేటర్లలో ఆదివారం వరకు అడ్వాన్స్ బుకింగ్ లోనే టికెట్లన్నీ అమ్ముడుపోతున్నాయని ట్రేడ్ రిపోర్ట్. చాలా అంటే చాలా కాలం తర్వాత రవితేజ సినిమాకు ఇలాంటి వాతావరణం చూస్తున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధమాకాకు కూడా కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందేమో కానీ ఇరుముడికి అసలా సమస్యే లేదన్నట్టు ఉంది.
ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాటకు థియేటర్లు ఊగిపోతున్నాయి. అయ్యప్ప మాల సీజన్ ఇంకా ప్రారంభం కానప్పటికీ ఏళ్ళ తరబడి ఆ దీక్షను తీసుకుంటున్న వాళ్ళు, త్వరలో మాల ధరించే వాళ్ళు ఈ సాంగ్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోయి హాలులోనే పూలు జల్లి డాన్సులు చేస్తున్నారు. ఈ దృశ్యం హైదరాబాద్ విమల్, సంధ్య థియేటర్లకు మాత్రమే పరిమితం కాలేదు. కరీంనగర్ నుంచి కర్నూలు దాకా అన్ని చోట్ల ఒకటే సీన్. పాట రావడం ఆలస్యం కుర్చీలో ఎవరూ ఉండటం లేదు.
పైగా దీనికి ఫాలోఅప్ గా పెట్టిన ఛేజుకు సైతం ఈ సాంగ్ పెట్టడం మరింత ఎలివేషన్ ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఇరుముడి ఓపెనింగ్స్ లో టైటిల్, రెండు అయ్యప్ప పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే దైవ మహిమలతో సంబంధం లేని ఒక క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్ లో చాలా తెలివిగా అయ్యప్ప మాల అంశాన్ని డిజైన్ చేసుకున్న దర్శకుడు శివ నిర్వాణ ట్విస్టులను అల్లుకోవడంలో చూపిన నేర్పరితనం ఆడియన్స్ ని మెప్పిస్తోంది.
వీకెండ్ వరకు ముత్యాల పల్లకితో ఇరుముడి హాళ్లు హోరెత్తిపోవడం ఖాయం. కొన్ని చోట్ల రిపీట్స్ కూడా వేశారని సమాచారం. రవితేజ ఫ్యాన్స్ ఇదంతా చూస్తూ యమా హ్యాపీగా ఉన్నారు. తొలి రోజు పెద్ద నెంబర్ వచ్చేలా ఉంది. సోషల్ మీడియాలో అత్యధిక శాతం ఇరుముడి పాటల రీల్స్ తోనే నిండిపోతున్నాయి. సినిమా ఎలా ఉందనే దానికన్నా ఈ సాంగ్ కి థియేటర్ లో వచ్చే వైబ్ కోసం ఖచ్చితంగా వెళ్లాలనిపించేలా బాగా వైరల్ చేస్తున్నారు. ఏదైతేనేం అందరూ హ్యాపీస్.
This post was last modified on August 21, 2026 4:34 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…