వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాకు ‘జనవరి 12 విడుదల’ టైటిల్ లాక్ చేయడం పట్ల అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ట్యాగ్ లైన్ గా ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అని పెట్టడం ఇద్దరు హీరోల అభిమానులను బ్యాలన్స్ చేయడం కోసమేననే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. దానికి తోడు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం వచ్చిన వంశీ ‘ఏప్రిల్ 1 విడుదల’ స్టయిల్ ని ఎంచుకోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి అనిల్ రావిపూడి ఇదంతా ముందే ఊహించారని ఇన్ సైడ్ టాక్. గతంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనౌన్స్ చేసినప్పుడు ఇదే జరిగింది. చిరంజీవి సినిమాకు ఇలాంటి పేరేంటని సోషల్ మీడియాలో కొంత హడావిడి జరిగింది. కట్ చేస్తే సంక్రాంతికి మూడు వందల కోట్లు వచ్చేశాయి. అంతకు ముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని వెంకటేష్ మూవీకి నామకరణం చేసినప్పుడూ ఇదే జరగడం గుర్తు చేసుకోవచ్చు. అది ఏ స్థాయి విజయమో చెప్పనక్కర్లేదు. ట్రిపుల్ సెంచరీ కొట్టింది.
ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ పాట పల్లవి మొదటి లైన్ తీసుకుని మహేష్ బాబు టైటిల్ గా పెట్టడం సాధారణంగా ఎవరూ ఊహించరు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’కి ఆ పేరు చాలా యాప్ట్ అనిపించింది. ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు జనవరి 12 విషయంలో కూడా అనిల్ అదే ధీమాగా ఉన్నారని సన్నిహితుల మాట. మొదట ఎలాంటి నెగటివిటీ వచ్చినా పట్టించుకోనవసరం లేదని, ఫైనల్ గా కంటెంట్ మాట్లాడుతుందని, అందుకే వెంకటేష్ సపోర్ట్ చేశారని అంటున్నారు.
ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా జనవరి 12 విడుదలకు కాంపిటీషన్ చాలా భారీగా ఉండబోతోంది. మెగా 158, సంబరాల ఏటిగట్టు, మహాకాళి, రవితేజ- శ్రీవిష్ణు, శర్వానంద్ జార్జ్ క్రిష్, రజనీకాంత్ ధర్మన్ తో పాటు మరికొన్ని సినిమాలు పండగ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ లో కనక బాలయ్య 111 రాకపోతే అది కూడా జై సంక్రాంతి అంటుంది. ఇలాంటి సందర్భాలు అనిల్ రావిపూడి ఫేస్ చేశాడు కానీ ఈసారి టైట్ అయ్యేలా ఉంది. ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో పండాల్సిందే.
This post was last modified on August 20, 2026 8:15 am
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…