వైజయంతీ మూవీస్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అశ్వినీదత్ కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పేరుతో కొత్త బేనర్ పెట్టి చిన్న సినిమాల నిర్మాణం మొదలుపెట్టారు దశాబ్దం కిందట. ఐతే వారికి ఆశించిన ఆరంభం దక్కలేదు. మొదట్లో ఈ బేనర్ మీద తీసిన సినిమాలన్నీ పోయాయి. ఐతే నాగ్ అశ్విన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ స్వప్న సినిమా బేనర్కు తొలి విజయాన్నందించింది. తర్వాత ఈ సంస్థ వైజయంతీ మూవీస్తో కలిసి తీసిన ‘మహానటి’ సంగతి చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు ‘స్వప్న సినిమా’ నుంచి రానున్న కొత్త సినిమా.. జాతి రత్నాలు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల ఆసక్తికర కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతకుముందు ‘పిట్టగోడ’ సినిమా తీసిన అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాకు నిర్మాతగా నాగ్ అశ్విన్ పేరు పడుతుండటం విశేషం. స్వప్న సినిమా బేనర్లో కొత్తగా వచ్చిన మార్పు ఇది.
ఇన్నాళ్లూ అశ్వినీదత్ కూతురు స్వప్న పేరు బేనర్లో ఉంటే.. నిర్మాతగా ప్రియాంక దత్ పేరు పడేది. కానీ ఇప్పుడు ఆమె భర్త అయిన నాగ్ అశ్విన్ పేరు నిర్మాత స్థానంలోకి వచ్చింది. దీంతో ఈ బేనర్ను అశ్విన్కు రాసిచ్చేశారా అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఐతే ‘మహానటి’ తర్వాత అశ్విన్ స్థాయి అమాంతం పెరిగిపోవడం, ఏకంగా ప్రభాస్తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని అతను దక్కించుకున్న నేపథ్యంలో తన పేరును వాడుకుంటే సినిమాకు పబ్లిసిటీ పరంగా కలిసొస్తుందని నిర్మాతగా నాగ్ అశ్విన్ పేరు వేసి ఉండే అవకాశం కూడా ఉంది.
ఈ సినిమా స్క్రిప్టు చర్చల్లో, అలాగే ప్రొడక్షన్లో నాగ్ యాక్టివ్ రోల్ ప్లే చేశాడట. అతడి క్రియేటివ్ ఇన్ పుట్స్ సినిమాకు బాగానే ఉపయోగపడినట్లు చెబుతున్నారు. మొన్న రిలీజ్ చేసిన నవీన్ పాత్ర టీజర్, తాజాగా రిలీజ్ చేసిన చిట్టి సాంగ్ చూస్తే ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందనే ఫీలింగ్ కలుగుతోంది. మరి నిర్మాతగా నాగ్ అశ్విన్ తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on January 12, 2021 11:15 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…