సునీల్కు గొప్ప పేరు తెచ్చింది, అతణ్ని ప్రేక్షకులు అమితంగా ఇష్టపడేలా చేసింది కామెడీ వేషాలే. కానీ అతను వాటిని విడిచిపెట్టి హీరో వేషాలపై మోజు పడ్డాడు. మొదట్లో కామెడీ టచ్ ఉన్న హీరో పాత్రలు, సినిమాలే చేసి మంచి ఫలితం అందుకున్న సునీల్.. ఆ తర్వాత మాత్రం గాడి తప్పాడు. రెగ్యులర్ మాస్ హీరోలు చేసే సబ్జెక్టులు ఎంచుకుని బోల్తా కొట్టాడు. ఒక దశ దాటాక పూర్తిగా హీరో వేషాలు ఆగిపోయాయి. దీంతో మళ్లీ కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఈ మధ్య విలన్ వేషాల్లో సైతం కనిపిస్తున్నాడు.
ఇక మళ్లీ అతను హీరోగా నటించడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ అతను ప్రధాన పాత్రలో ఓ సినిమా మొదలైంది. ఆ సినిమా పేరు.. వేదాంతం రాఘవయ్య. చంద్రమోహన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. శనివారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.
14 రీల్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ‘వేదాంతం రాఘవయ్య’ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇంతకంటే విశేషం ఏంటంటే.. ఈ సంస్థలో ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని రూపొందించిన అగ్ర దర్శకుడు హరీష్ శంకర్.. ‘వేదాంతం రాఘవయ్య’కు కథ అందిస్తున్నాడు. అతడి సమర్పణలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.
దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో వేదాంతం రాఘవయ్య తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. దేవదాసు, అనార్కలి సహా అద్భుతమైన చిత్రాలను అందించారు. ఆయన వ్యక్తిగత, సినీ జీవితంలో ఎన్నో విశేషాలున్నాయి. అలాంటి వ్యక్తి జీవిత కథను తెరపైకి తేవడానికి హరీష్ శంకర్, 14 రీల్స్ అధినేతలు నడుం బిగించడం విశేషమే. సునీల్ ఈ పాత్రను ఎలా పోషిస్తాడన్నది ఆసక్తికరం. ‘మహానటి’ తరహాలో హృద్యంగా తీయగలిగితే ఈ సినిమా కూడా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసే అవకాశముంది.
This post was last modified on January 9, 2021 7:03 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…