సునీల్కు గొప్ప పేరు తెచ్చింది, అతణ్ని ప్రేక్షకులు అమితంగా ఇష్టపడేలా చేసింది కామెడీ వేషాలే. కానీ అతను వాటిని విడిచిపెట్టి హీరో వేషాలపై మోజు పడ్డాడు. మొదట్లో కామెడీ టచ్ ఉన్న హీరో పాత్రలు, సినిమాలే చేసి మంచి ఫలితం అందుకున్న సునీల్.. ఆ తర్వాత మాత్రం గాడి తప్పాడు. రెగ్యులర్ మాస్ హీరోలు చేసే సబ్జెక్టులు ఎంచుకుని బోల్తా కొట్టాడు. ఒక దశ దాటాక పూర్తిగా హీరో వేషాలు ఆగిపోయాయి. దీంతో మళ్లీ కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఈ మధ్య విలన్ వేషాల్లో సైతం కనిపిస్తున్నాడు.
ఇక మళ్లీ అతను హీరోగా నటించడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ అతను ప్రధాన పాత్రలో ఓ సినిమా మొదలైంది. ఆ సినిమా పేరు.. వేదాంతం రాఘవయ్య. చంద్రమోహన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. శనివారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.
14 రీల్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ‘వేదాంతం రాఘవయ్య’ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇంతకంటే విశేషం ఏంటంటే.. ఈ సంస్థలో ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని రూపొందించిన అగ్ర దర్శకుడు హరీష్ శంకర్.. ‘వేదాంతం రాఘవయ్య’కు కథ అందిస్తున్నాడు. అతడి సమర్పణలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.
దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో వేదాంతం రాఘవయ్య తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. దేవదాసు, అనార్కలి సహా అద్భుతమైన చిత్రాలను అందించారు. ఆయన వ్యక్తిగత, సినీ జీవితంలో ఎన్నో విశేషాలున్నాయి. అలాంటి వ్యక్తి జీవిత కథను తెరపైకి తేవడానికి హరీష్ శంకర్, 14 రీల్స్ అధినేతలు నడుం బిగించడం విశేషమే. సునీల్ ఈ పాత్రను ఎలా పోషిస్తాడన్నది ఆసక్తికరం. ‘మహానటి’ తరహాలో హృద్యంగా తీయగలిగితే ఈ సినిమా కూడా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసే అవకాశముంది.
This post was last modified on January 9, 2021 7:03 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…