ఒక దశలో ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్-2’ లాంటి విజయాలతో మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్ మంచి ఊపు మీదే ఉండేది. కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక ట్రాక్ తప్పాడు వరుణ్. అందులో గత మూణ్నాలుగేళ్లలో పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎంతో కష్టపడి చేసిన గని, మట్కా సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకుని వరుణ్ మార్కెట్ను బాగా దెబ్బ తీసేశాయి.
థియేటర్ల నుంచి ఏమీ పెద్దగా ఏమీ తీసుకురాలేకపోయిన ఆ చిత్రాలకు ఓటీటీలో కూడా ఆశించిన స్పందన రాలేదు. ఈ ప్రభావం వరుణ్ భవిష్యత్ చిత్రాల మీద కూడా పడుతుందేమో అనిపించింది. ఐతే కొంచెం గ్యాప్ తీసుకుని వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీతో ‘కొరియన్ కనకరాజు’ సినిమాను లైన్లో పెట్టిన మెగా కుర్రాడు జనాల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించగలిగాడు. ఈ మూవీ ప్రోమోలు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి.
ఆగస్టు 7న ‘కొరియన్ కనకరాజు’ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమా బిజినెస్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఒక ఓటీటీ సంస్థ రూ.26 కోట్లకు కొన్నట్లుగా చెబుతున్నారు. కానీ ఈ నంబర్ అనుమానాలు రేకెత్తిస్తోంది.
డిజిటల్ మార్కెట్ ఈ మధ్య బాగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలకు కూడా అనుకున్న రేట్లు రావట్లేదు. ఇలాంటి టైంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో సినిమాను ఇంత రేటు పెట్టి కొంటారా అన్నది సందేహం. ముందేమో రైట్స్ రూ.15 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడేమో రూ.26 కోట్లు అంటున్నారు.
ఐతే ఈ మధ్య కొన్ని సినిమాలకు ఇలా ఎక్కువ రేటు అని వార్తలు వస్తున్నా.. అది థియేటర్లలో రాబట్టే వసూళ్లను బట్టి ఇచ్చే ధర అంటున్నారు. ఇన్ని కలెక్షన్లు వస్తేనే ఈ రేటు.. కలెక్షన్లు తగ్గితే ఆ మేరకు డిజిటల్ హక్కుల రేటు కూడా తగ్గించేలా.. ఓటీటీలో వ్యూస్ను బట్టి కూడా ఫైనల్ రేటు నిర్ణయించేలా డీల్స్ ఉంటున్నాయి. ‘కొరియన్ కనకరాజు’కు కూడా అలాంటి కండిషన్ పెట్టే ఈ రేటు చెప్పి ఉంటారని అనుకోవచ్చు.
This post was last modified on July 24, 2026 11:13 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…