Movie News

బాలయ్య సినిమానే కావాలని పట్టుబట్టిన విజయ్

తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయంతో అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన విజయ్.. చివరగా ఒకసారి బాక్సాఫీస్ వరకు రెడీ అయ్యాడు. ఆయన చివరి చిత్రం జననాయగన్ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పబోతూ చివరగా చేసే చిత్రం చాలా స్పెషల్ గా ఉండాలని ఏ పెద్ద హీరో అయినా భావిస్తాడు. రీమేక్ మూవీ చెయ్యాలని అనుకోడు.

కానీ విజయ్ మాత్రం నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు చిత్రం భగవంత్ కేసరి రీమేక్ తో కెరీర్ ను ముగించాలని అనుకోవడం ఆశ్చర్యమే. నిజానికి విజయ్ చివరి చిత్రానికి దర్శకుడిగా ఎంపికైన హెచ్.వినోద్ కు రీమేక్ మూవీ చేసే ఉద్దేశం లేదట. కానీ విజయ్ పట్టుబట్టి బాలయ్య సినిమాను తనతో రీమేక్ చేయించాడట.

విజయ్ చివరి సినిమా కోసం సంప్రదింపులు జరిగినపుడు.. తాను క్లాష్ ఆఫ్ మాస్టర్స్ అని ఒక కథ చెప్పానని.. ఆ కథ బావున్నప్పటికీ తాను చేసే లాస్ట్ మూవీ అంత హెవీగా వద్దని విజయ్ తనతో అన్నాడని.. భగవత్ కేసరిని రీమేక్ చేద్దామని ఆయనే సూచించాడని వినోద్ తెలిపాడు.

విజయ్, బాలయ్య ప్రపంచాలు పూర్తిగా వేరని.. ఈ సినిమానే ఎందుకు రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నారు అని అడిగితే.. భగవంత్ కేసరిలో ఒక్కో సీన్ గురించి ఆయన వివరించి వాటి ప్రత్యేకత గురించి చెప్పారని వినోద్ తెలిపాడు.

ఇందులో ఆడ పిల్లల సాధికారత గురించి చెప్పిన విషయాలు విజయ్ కి ఎక్కువ నచ్చినట్లు వినోద్ వెల్లడించాడు. ఐతే ఒరిజినల్ తో పోలిస్తే జననాయగన్ లో దాదాపు 50 శాతం మార్పులు ఉంటాయని.. ప్రథమార్ధంలో 60 శాతం సీన్లు మాతృక నుంచి తీసుకున్నవి ఉంటే.. రెండో అర్ధంలో 20 శాతమే ఉంటాయని వినోద్ చెప్పాడు.

This post was last modified on July 21, 2026 8:36 am

Share

Recent Posts

మన బిగ్ బాస్.. వాళ్ల బిగ్ బాస్… ఎంత తేడా?

తెలుగులో అత్యంత ఆదరణ దక్కించుకున్న టీవీ షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి. దీని ద్వారా ఎంతోమంది సాధారణ ప్రజలు సెలబ్రెటీలుగా…

1 hour ago

బాలయ్యకు విలన్‌గా ఐశ్వర్య రాజేష్?

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు. కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. ఆమె అచ్చ…

2 hours ago

పవన్ కబ్జా చేశాడా… హైడ్రా కమిషనర్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫామ్ హౌస్ గురించి ఈ మధ్య…

2 hours ago

సింహాద్రి సీన్… రాజమౌళి ని అందరూ వ్యతిరేకించినా

దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం.. సింహాద్రి. ఆయనకు అది రెండో సినిమానే. కానీ ఏకంగా ఇండస్ట్రీ…

2 hours ago

మోదీ జీ… ఇంత ఆలస్యం అయితే ఎలా?

నీట్ పేపర్ లీక్ ఇష్యూపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. ఎగ్జామ్స్ పారదర్శకంగా జరగడం దేశ బాధ్యత…

3 hours ago

మరో రెండు నెలల్లో భారత నావికుడి పెళ్లి.. ఈలోపే…

రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…

5 hours ago