ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి. మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్లో ఏకచక్రాధిపత్యం సాగించిన చిరూకి ఆ రేంజ్ క్రేజ్, ఫాలోయింగ్ రావడానికి ఆయన క్యారెక్టర్ కూడా ఓ కారణం. రీఎంట్రీ తర్వాత సోషల్ మీడియాలోనూ ఓ ఆటాడుకుంటున్న మెగాస్టార్ మరోసారి తన ఉదారతను చూపించి, టాలీవుడ్ జనాల మనసులు గెలుచుకున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో మొదట హీరోయిన్గా త్రిషను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత మెగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి, మెగా టీమ్కు షాక్ ఇచ్చింది త్రిష.
‘తనకు చెప్పిన స్క్రిప్ట్ ఒకటి, తీస్తున్నది ఒక్కటి’ అంటూ కొరటాల శివపై, మెగాస్టార్పై సెటైరికల్ కామెంట్లు కూడా చేసింది త్రిష. త్రిష అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ను ఎంపిక చేసింది ‘ఆచార్య’ యూనిట్.
తన సినిమా నుంచి సడెన్గా తప్పుకున్నా, అవేమీ మనసులో పెట్టుకోకుండా త్రిషకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. ‘సంతోషం, విజయం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని’ త్రిషకు విషెస్ తెలిపారు. మే 4న జన్మించిన త్రిష, తన 37వ పుట్టినరోజు జరుపుకుంటోంది.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…