Movie News

‘ఆచార్య’ మాజీ హీరోయిన్‌ను విష్ చేసిన చిరూ

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్‌లో ఏకచక్రాధిపత్యం సాగించిన చిరూకి ఆ రేంజ్ క్రేజ్, ఫాలోయింగ్ రావడానికి ఆయన క్యారెక్టర్ కూడా ఓ కారణం. రీఎంట్రీ తర్వాత సోషల్ మీడియాలోనూ ఓ ఆటాడుకుంటున్న మెగాస్టార్ మరోసారి తన ఉదారతను చూపించి, టాలీవుడ్ జనాల మనసులు గెలుచుకున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో మొదట హీరోయిన్‌గా త్రిషను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత మెగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి, మెగా టీమ్‌కు షాక్ ఇచ్చింది త్రిష.

‘తనకు చెప్పిన స్క్రిప్ట్‌ ఒకటి, తీస్తున్నది ఒక్కటి’ అంటూ కొరటాల శివపై, మెగాస్టార్‌పై సెటైరికల్ కామెంట్లు కూడా చేసింది త్రిష. త్రిష అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది ‘ఆచార్య’ యూనిట్.

తన సినిమా నుంచి సడెన్‌గా తప్పుకున్నా, అవేమీ మనసులో పెట్టుకోకుండా త్రిషకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. ‘సంతోషం, విజయం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని’ త్రిషకు విషెస్ తెలిపారు. మే 4న జన్మించిన త్రిష, తన 37వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

This post was last modified on May 5, 2020 1:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ స‌తీమ‌ణిపై దుర్భాష‌లు.. టీడీపీ నేత‌పై బాబు క‌ఠిన చ‌ర్య‌లు

త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. త‌న పార్టీవారిని కూడా వ‌దిలి…

16 minutes ago

పాత వాహనాలపై కొత్త నిబంధనలు.. లేదంటే కేసే!

మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…

33 minutes ago

పెద్ది అసలు కథ వేరే ఉంది

ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…

47 minutes ago

పవన్ నిబద్ధతకు అద్దం పట్టిన ‘బాట’ వీడియో

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…

2 hours ago

బాషా ఫ్లాష్ బ్యాక్ : ముఖ్యమంత్రితో వివాదం

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…

2 hours ago

భారత్‌కు 26/11 కీలక నిందితుడు.. పాకిస్తాన్ పాత్ర బయటపడుతుందా?

2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు…

2 hours ago