పవన్కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేయాలని డిసైడ్ అయినపుడు ఫాన్స్ ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ షేప్ తీసుకుంటోన్న తీరు చూసి ఫాన్స్ నమ్మకం పెంచుకుంటున్నారు. వకీల్ సాబ్తో పోలిస్తే కచ్చితంగా ఇందులో చాలా ఆకర్షణలుంటాయని భావిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో పాత్ర చేయడానికి అంగీకరించడంతో పాటు త్రివిక్రమ్ మాటలు రాయడం, తమన్ సంగీతం చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్కి క్రేజ్ వచ్చేసింది. దర్శకుడు సాగర్ చంద్రకు అనుభవం లేకపోయినా కానీ మిగతా విషయాలలో ఈ చిత్రం రెడ్ హాట్ అనిపిస్తోంది.
ఇదిలావుంటే ఇందులో నటించే హీరోయిన్లు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. పవన్ సరసన సాయి పల్లవి నటిస్తుందనే ప్రచారం జరిగింది కానీ నిర్మాతలు ఇంకా ఆ పేరు ప్రకటించలేదు. ఆమె ఇప్పుడు తెలుగులో పలు చిత్రాలతో పాటు ఇతర భాషలలోను బిజీగా వుంది కనుక వేగంగా పూర్తి చేయాలని చూస్తోన్న ఈ సినిమాకు డేట్లు ఇవ్వలేకపోవచ్చునని ఒక టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి కాని పక్షంలో పవన్కి జోడీగా ఎవరయితే బాగుంటుందని భావిస్తారో? మళ్లీ శృతిహాసన్ లేదా కాజల్ని మాత్రం పెట్టకండంటున్నారు ఫాన్స్.
This post was last modified on January 8, 2021 2:16 am
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…