పవన్కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేయాలని డిసైడ్ అయినపుడు ఫాన్స్ ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ షేప్ తీసుకుంటోన్న తీరు చూసి ఫాన్స్ నమ్మకం పెంచుకుంటున్నారు. వకీల్ సాబ్తో పోలిస్తే కచ్చితంగా ఇందులో చాలా ఆకర్షణలుంటాయని భావిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో పాత్ర చేయడానికి అంగీకరించడంతో పాటు త్రివిక్రమ్ మాటలు రాయడం, తమన్ సంగీతం చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్కి క్రేజ్ వచ్చేసింది. దర్శకుడు సాగర్ చంద్రకు అనుభవం లేకపోయినా కానీ మిగతా విషయాలలో ఈ చిత్రం రెడ్ హాట్ అనిపిస్తోంది.
ఇదిలావుంటే ఇందులో నటించే హీరోయిన్లు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. పవన్ సరసన సాయి పల్లవి నటిస్తుందనే ప్రచారం జరిగింది కానీ నిర్మాతలు ఇంకా ఆ పేరు ప్రకటించలేదు. ఆమె ఇప్పుడు తెలుగులో పలు చిత్రాలతో పాటు ఇతర భాషలలోను బిజీగా వుంది కనుక వేగంగా పూర్తి చేయాలని చూస్తోన్న ఈ సినిమాకు డేట్లు ఇవ్వలేకపోవచ్చునని ఒక టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి కాని పక్షంలో పవన్కి జోడీగా ఎవరయితే బాగుంటుందని భావిస్తారో? మళ్లీ శృతిహాసన్ లేదా కాజల్ని మాత్రం పెట్టకండంటున్నారు ఫాన్స్.
This post was last modified on January 8, 2021 2:16 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…