తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా అయితే మరింత ఆశ్చర్యం కలిగించే విషయమే. మా ఇంటి బంగారం మూవీతో సమంత ఈ గొప్ప ఘనతనే సాధించింది. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేని ఈ చిత్రం.. రిలీజ్ రోజు ఒక మోస్తరు టాకే తెచ్చుకుంది.
కానీ రిలీజ్ టైమింగ్ కలిసి రావడం.. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి రావడం.. సమంత స్టార్ పవర్.. అన్నీ తోడై సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. తొలి వీకెండ్ మెరుపులకు పరిమితం కాకుండా.. లాంగ్ రన్తో ఏకంగా వంద కోట్ల గ్రాస్ వసూళ్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. ఐతే రిలీజ్కు ముందు ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని సమంత కూడా నమ్మలేదట. ఆమె భయాల గురించి దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాత రాజ్ నిడిమోరు ఇంతకుముందే వెల్లడించారు.
ఇప్పుడీ సినిమా వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన నేపథ్యంలో సమంత స్వయంగా రిలీజ్కు ముందు టెన్షన్ గురించి వెల్లడించింది. ఒక డిస్ట్రిబ్యూటర్తో ఫోన్ కాల్ తననెంత టెన్షన్ పెట్టిందీ సమంత వివరించింది. సమంత పక్కనే ఉండగా.. ఆమె ఫ్రెండ్ ఒకరు ఒక డిస్ట్రిబ్యూటర్కు ఫోన్ చేసి మా ఇంటి బంగారం సినిమా ఎలా ఆడొచ్చు, ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారా అని అడిగారట. దానికా డిస్ట్రిబ్యూటర్ బదులిస్తూ.. ఈ రోజుల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఎవరు చూస్తారు, ఈ సినిమా ఆడదన్నట్లుగా మాట్లాడాడట.
ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరో సినిమాలో గ్లామర్ రోల్ చేస్తే థియేటర్లకు వస్తారేమో కానీ.. ఇలాంటి సినిమాలు జనం చూడరని అతను తేల్చేశాడట. ఐతే మా ఇంటి బంగారం ఇంత పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో ఇకపై ఆ డిస్ట్రిబ్యూటర్ సహా ఎవరూ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ గురించి ఇలా మాట్లాడరని.. కనీసం ఏం జరుగుతుందో చూద్దాం అని అంటారని సమంత వ్యాఖ్యానించింది.
This post was last modified on July 13, 2026 10:46 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…