కొత్త ఏడాదిలో సినిమా సందడికి తెర లేవబోతోంది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే మాస్ రాజా రవితేజ సినిమా క్రాక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ చిత్రానికి ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు.
గత ఏడాది ఆరంభంలో భీష్మ ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత టాలీవుడ్లో ఒక పేరున్న సినిమాకు జరిగిన బహిరంగ ప్రి రిలీజ్ ఈవెంట్ ఇదే. మధ్యలో కొన్ని సినిమాలకు వర్చువల్ ఈవెంట్లు చేశారు. కానీ పూర్వంలా ఆడిటోరియంలో ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య జరిగిన ఈవెంట్ ఇదే. ఈ వేడుకకు హీరోయిన్ శ్రుతి హాసన్, సంగీత దర్శకుడు తమన్ రాలేకపోయారు. హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు మిగతా యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
ఈ వేడుకలో దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. ట్రైలర్లో అన్నట్లు ఈ సినిమా స్యూర్ షాట్, నో డౌట్ అని చెప్పాడు. రవితేజ తనకు డాన్ శీను మూవీ ద్వారా సినిమాల్లో లైఫ్ ఇచ్చిన వ్యక్తి అని.. ఆ సినిమాతో పాటు తర్వాత తమ కాంబినేషన్లో వచ్చిన బలుపు సైతం సూపర్ హిట్టయిందని.. ఇప్పుడు క్రాక్తో తమది బ్లాక్బస్టర్ కాంబినేషన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. క్రాక్కు అద్భుతమైన కథ కుదిరిందని.. ఈ సినిమాలో భాగమైన వాళ్లందరూ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారని గోపీచంద్ తెలిపాడు.
ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిందని.. రవితేజ చేసిన పోలీస్ పాత్ర, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన విలన్ పాత్రలు.. ఇంకా మరికొన్ని క్యారెక్టర్లు నిజ జీవితం నుంచి తీసుకున్నవని.. ఆ వ్యక్తులందరూ నిజంగానే ఉన్నారని.. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులకు థ్రిల్లింగ్గా అనిపిస్తాయని గోపీ చెప్పాడు. సంగీత దర్శకుడు తమన్ చెన్నైలో ఫైనల్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. ఫ్లైట్లో అతడి దగ్గరికి వెళ్లాలని.. మిగతా విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పి హడావుడిగా తన ప్రసంగం ముగించి వెళ్లిపోయాడు గోపీ.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…