కొత్త ఏడాదిలో సినిమా సందడికి తెర లేవబోతోంది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే మాస్ రాజా రవితేజ సినిమా క్రాక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ చిత్రానికి ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు.
గత ఏడాది ఆరంభంలో భీష్మ ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత టాలీవుడ్లో ఒక పేరున్న సినిమాకు జరిగిన బహిరంగ ప్రి రిలీజ్ ఈవెంట్ ఇదే. మధ్యలో కొన్ని సినిమాలకు వర్చువల్ ఈవెంట్లు చేశారు. కానీ పూర్వంలా ఆడిటోరియంలో ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య జరిగిన ఈవెంట్ ఇదే. ఈ వేడుకకు హీరోయిన్ శ్రుతి హాసన్, సంగీత దర్శకుడు తమన్ రాలేకపోయారు. హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు మిగతా యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
ఈ వేడుకలో దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. ట్రైలర్లో అన్నట్లు ఈ సినిమా స్యూర్ షాట్, నో డౌట్ అని చెప్పాడు. రవితేజ తనకు డాన్ శీను మూవీ ద్వారా సినిమాల్లో లైఫ్ ఇచ్చిన వ్యక్తి అని.. ఆ సినిమాతో పాటు తర్వాత తమ కాంబినేషన్లో వచ్చిన బలుపు సైతం సూపర్ హిట్టయిందని.. ఇప్పుడు క్రాక్తో తమది బ్లాక్బస్టర్ కాంబినేషన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. క్రాక్కు అద్భుతమైన కథ కుదిరిందని.. ఈ సినిమాలో భాగమైన వాళ్లందరూ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారని గోపీచంద్ తెలిపాడు.
ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిందని.. రవితేజ చేసిన పోలీస్ పాత్ర, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన విలన్ పాత్రలు.. ఇంకా మరికొన్ని క్యారెక్టర్లు నిజ జీవితం నుంచి తీసుకున్నవని.. ఆ వ్యక్తులందరూ నిజంగానే ఉన్నారని.. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులకు థ్రిల్లింగ్గా అనిపిస్తాయని గోపీ చెప్పాడు. సంగీత దర్శకుడు తమన్ చెన్నైలో ఫైనల్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. ఫ్లైట్లో అతడి దగ్గరికి వెళ్లాలని.. మిగతా విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పి హడావుడిగా తన ప్రసంగం ముగించి వెళ్లిపోయాడు గోపీ.
This post was last modified on January 7, 2021 11:54 am
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…