కొత్త ఏడాదిలో సినిమా సందడికి తెర లేవబోతోంది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే మాస్ రాజా రవితేజ సినిమా క్రాక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ చిత్రానికి ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు.
గత ఏడాది ఆరంభంలో భీష్మ ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత టాలీవుడ్లో ఒక పేరున్న సినిమాకు జరిగిన బహిరంగ ప్రి రిలీజ్ ఈవెంట్ ఇదే. మధ్యలో కొన్ని సినిమాలకు వర్చువల్ ఈవెంట్లు చేశారు. కానీ పూర్వంలా ఆడిటోరియంలో ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య జరిగిన ఈవెంట్ ఇదే. ఈ వేడుకకు హీరోయిన్ శ్రుతి హాసన్, సంగీత దర్శకుడు తమన్ రాలేకపోయారు. హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు మిగతా యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
ఈ వేడుకలో దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. ట్రైలర్లో అన్నట్లు ఈ సినిమా స్యూర్ షాట్, నో డౌట్ అని చెప్పాడు. రవితేజ తనకు డాన్ శీను మూవీ ద్వారా సినిమాల్లో లైఫ్ ఇచ్చిన వ్యక్తి అని.. ఆ సినిమాతో పాటు తర్వాత తమ కాంబినేషన్లో వచ్చిన బలుపు సైతం సూపర్ హిట్టయిందని.. ఇప్పుడు క్రాక్తో తమది బ్లాక్బస్టర్ కాంబినేషన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. క్రాక్కు అద్భుతమైన కథ కుదిరిందని.. ఈ సినిమాలో భాగమైన వాళ్లందరూ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారని గోపీచంద్ తెలిపాడు.
ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిందని.. రవితేజ చేసిన పోలీస్ పాత్ర, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన విలన్ పాత్రలు.. ఇంకా మరికొన్ని క్యారెక్టర్లు నిజ జీవితం నుంచి తీసుకున్నవని.. ఆ వ్యక్తులందరూ నిజంగానే ఉన్నారని.. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులకు థ్రిల్లింగ్గా అనిపిస్తాయని గోపీ చెప్పాడు. సంగీత దర్శకుడు తమన్ చెన్నైలో ఫైనల్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. ఫ్లైట్లో అతడి దగ్గరికి వెళ్లాలని.. మిగతా విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పి హడావుడిగా తన ప్రసంగం ముగించి వెళ్లిపోయాడు గోపీ.
This post was last modified on January 7, 2021 11:54 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…