టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ సొగసు చూడతరమా, బాల రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు లాంటి కొన్ని సెన్సేషనల్ సినిమాలు తీసినప్పటికీ ఆయన కెరీర్లో ఎక్కువగా ఫెయిల్యూర్లే కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక్కడు తర్వాత ఆయన్నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా రాలేదు. రుద్రమదేవి ఉన్నంతలో బాగానే ఆడింది కానీ.. దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే అది కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది.
ఐతే ఈ చిత్రానికి ముందు గుణశేఖర్ ట్రాక్ రికార్డు దారుణంగా ఉన్నప్పటికీ.. రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించాడు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆ మొత్తంలో రికవరీ చేయడం అసాధ్యమని, పెద్ద మొత్తంలో నష్టం తప్పదని అనుకన్నారంతా. కానీ ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడి.. గుణశేఖర్ స్వల్ప నష్టాలతో బయటపడేలా చేసింది
ఈ చిత్రం తర్వాత భారీ బడ్జెట్లో హిరణ్య కశ్యప చేయాలనుకున్నాడు గుణ. కానీ మూడేళ్లకు పైగా ఈ ప్రాజెక్టు మీద పని చేశాక అది హోల్డ్లో పడిపోయింది. ప్రస్తుతానికి హీరో రానా, నిర్మాత సురేష్ బాబు వెనక్కి తగ్గారు. అదెప్పుడు పట్టాలెక్కుతుందో కానీ.. ఈలోపు శాకుంతలం అంటూ మరో మైథలాజికల్ సినిమా తీయడానికి గుణ రంగం సిద్ధం చేశాడు. ఇది ఆయన సొంత బేనర్లోనే తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని కూడా రుద్రమదేవికి దీటుగా భారీ బడ్జెట్లోనే తీయబోతున్నాడట. ప్రి ప్రొడక్షన్ వర్క్కే కోట్లల్లో ఖర్చు పెడుతున్నాడు గుణ. సినిమా కోసం భారీ సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయి. సంబంధిత ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు గుణశేఖర్.
ఐతే రుద్రమదేవితో పెద్దగా సంపాదించిందేమీ లేదు. గత దశాబ్దంన్నరలో గుణ తీసిన ఇతర సినిమాలన్నీ తుస్సుమన్నాయి. వీటితో అతనేం సంపాదించాడో ఏమో. అయినా సరే.. రుద్రమదేవి తర్వాత మరో సాహసోపేత ప్రాజెక్టును తలకెత్తుకున్నాడు గుణ. మరి ఇంత భారీ సినిమాలు తీయడానికి గుణ ఎలా సమకూర్చుకుంటున్నాడో అని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. అతణ్ని నమ్మి ఫైనాన్షియర్లు ఇంతేసి డబ్బులు సమకూరుస్తున్నా గొప్ప విషయమే అనుకోవాలి.
This post was last modified on January 7, 2021 11:51 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…