టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ సొగసు చూడతరమా, బాల రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు లాంటి కొన్ని సెన్సేషనల్ సినిమాలు తీసినప్పటికీ ఆయన కెరీర్లో ఎక్కువగా ఫెయిల్యూర్లే కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక్కడు తర్వాత ఆయన్నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా రాలేదు. రుద్రమదేవి ఉన్నంతలో బాగానే ఆడింది కానీ.. దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే అది కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది.
ఐతే ఈ చిత్రానికి ముందు గుణశేఖర్ ట్రాక్ రికార్డు దారుణంగా ఉన్నప్పటికీ.. రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించాడు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆ మొత్తంలో రికవరీ చేయడం అసాధ్యమని, పెద్ద మొత్తంలో నష్టం తప్పదని అనుకన్నారంతా. కానీ ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడి.. గుణశేఖర్ స్వల్ప నష్టాలతో బయటపడేలా చేసింది
ఈ చిత్రం తర్వాత భారీ బడ్జెట్లో హిరణ్య కశ్యప చేయాలనుకున్నాడు గుణ. కానీ మూడేళ్లకు పైగా ఈ ప్రాజెక్టు మీద పని చేశాక అది హోల్డ్లో పడిపోయింది. ప్రస్తుతానికి హీరో రానా, నిర్మాత సురేష్ బాబు వెనక్కి తగ్గారు. అదెప్పుడు పట్టాలెక్కుతుందో కానీ.. ఈలోపు శాకుంతలం అంటూ మరో మైథలాజికల్ సినిమా తీయడానికి గుణ రంగం సిద్ధం చేశాడు. ఇది ఆయన సొంత బేనర్లోనే తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని కూడా రుద్రమదేవికి దీటుగా భారీ బడ్జెట్లోనే తీయబోతున్నాడట. ప్రి ప్రొడక్షన్ వర్క్కే కోట్లల్లో ఖర్చు పెడుతున్నాడు గుణ. సినిమా కోసం భారీ సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయి. సంబంధిత ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు గుణశేఖర్.
ఐతే రుద్రమదేవితో పెద్దగా సంపాదించిందేమీ లేదు. గత దశాబ్దంన్నరలో గుణ తీసిన ఇతర సినిమాలన్నీ తుస్సుమన్నాయి. వీటితో అతనేం సంపాదించాడో ఏమో. అయినా సరే.. రుద్రమదేవి తర్వాత మరో సాహసోపేత ప్రాజెక్టును తలకెత్తుకున్నాడు గుణ. మరి ఇంత భారీ సినిమాలు తీయడానికి గుణ ఎలా సమకూర్చుకుంటున్నాడో అని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. అతణ్ని నమ్మి ఫైనాన్షియర్లు ఇంతేసి డబ్బులు సమకూరుస్తున్నా గొప్ప విషయమే అనుకోవాలి.
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…