వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ బ్రేక్ వేసింది కానీ లేకపోతే ట్రాక్ రికార్డు మరింత వెలిగేది. స్వతహాగా దర్శకుడైన ప్రదీప్ తనకు హీరోగా ఆఫర్స్ ఎక్కువగా రావడం వల్ల డైరెక్షన్ కు దూరంగా ఉన్నాడు.ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ లోకి దిగిపోయాడు. ఇవాళ చిన్న వీడియో రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇదంతా మాములు విషయమే కదా అని అనుకోవచ్చు.
అసలు ట్విస్టు వేరే ఉంది. ఈ సినిమాకు ఒకరిద్దరు కాదు ఏకంగా ఆరుగురు దర్శకులు ఒక బృందంగా పని చేయబోతున్నారు. వాళ్లకు అల్ఫా యూనిట్ అని నామకరణం చేసిన ప్రదీప్ రంగనాథన్ తన ప్రొడక్షన్ కి PRS 01 అని పెట్టాడు. అనే వాలా స్టార్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు క్యాప్షన్ చూస్తే అర్థమవుతోంది. మమిత బైజు, శ్వాసిక తదితరులతో పాటు మన టాలీవుడ్ శివాజీ ఇందులో కీలక పాత్ర పోషించనున్నాడు. లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంక్కర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఇందులో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ ఉండరు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. మరో దర్శకుడు అశ్వత్ మరిముత్తుకో కీలక పాత్ర ఇచ్చారు. ఇది ఒకరకంగా ప్రయోగమని చెప్పాలి. ఎందుకంటే ఒక దర్శకుడికి ఎంత మందైనా అసిస్టెంట్లు ఉండొచ్చు. కానీ ఒక సినిమాకు ఆరుగురు దర్శకులు ఉండటం రేర్. అందరికీ గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ప్రదీప్ రంగనాధన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. పోస్టర్, సెటప్ చూస్తుంటే ఇది రెగ్యులర్ రామ్ కామ్ లా అనిపించడం లేదు. పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వయొలెన్స్ ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.
తమిళ తెలుగు భాషల్లో రూపొందబోయే ఈ పిఆర్ఎస్ 01 షూటింగ్ మొదలైపోయింది. తెలుగులో రామ్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు దర్శకులుగా మారుతుంటే, దర్శకుడిగా మొదలై హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు. ఈ కొత్త పాత్రలో ఏ మేరకు మెప్పించబోతున్నాడో చూడాలి. ఇప్పటిదాకా కేవలం యూత్ ని లక్ష్యంగా పెట్టుకుంటూ వచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఈసారి మాస్ వర్గాలను టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడున్న ట్రెండ్ లో ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు అవసరమే.
This post was last modified on July 6, 2026 12:24 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…