స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం సహజం. పాత్ర స్క్రీన్ టైం తక్కువ ఉన్నా, ఆ క్యారెక్టర్కు ప్రాధాన్యం లేకపోయినా.. అభిమానులు నిరాశ చెందడంతో పాటు సోషల్ మీడియాలో, మీడియాలో నెగెటివ్ కామెంట్లు పడిపోతాయి. ఐతే కొన్నిసార్లు మేకింగ్ టైంలో ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించినా.. ఎడిటింగ్లో కొన్ని సన్నివేశాలకు కోత పడిపోవడం వల్ల పాత్రల ప్రాధాన్యం తగ్గిపోతుంటుంది.
కొన్నిసార్లు మేకింగ్ టైంలోనే తమ పాత్రలకు ఆశించిన ప్రాధాన్యం లేదని ఆర్టిస్టులకు అర్థమైపోతుంటుంది. అలాంటపుడు అభిమానులను ముందే ప్రిపేర్ చేయడం మంచిదే. కాజల్ అగర్వాల్ ఈ పనే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం రామాయణలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో రావణుడిగా నటిస్తున్న యశ్కు జోడీగా మండోదరి పాత్రలో కనిపించనుంది కాజల్. మామూలుగా రామాయణం కథను పరిశీలించినా.. దాని మీద వచ్చిన సినిమాలను గమనించినా.. మండోదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. కొత్త రామాయణం కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదని స్పష్టమవుతోంది.
కాజల్ స్వయంగా తన పాత్ర చిన్నదే అంటూ ముందే హింట్ ఇచ్చేసింది. రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం ఒక భాగం షూటింగ్ మాత్రమే పూర్తయిందని, లంకలో వచ్చే సన్నివేశాలే తక్కువ అని, తన పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని కాజల్ వెల్లడించింది.
తన పాత్ర చిన్నదే అయినా.. ఇలాంటి మెగా ప్రాజెక్టులో భాగం కావడమే అదృష్టమని కాజల్ వ్యాఖ్యానించింది.
యశ్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నారని.. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభవమని కాజల్ వ్యాఖ్యానించింది. కాజల్ ముందే హింట్ ఇచ్చేసింది కాబట్టి.. రేప్పొద్దున రామాయణంలో ఆమెది చాలా చిన్న పాత్ర అని ఫ్యాన్స్ ఫీలవ్వాల్సిన అసవరం లేదు. అయినా కెరీర్లో ఈ దశలో కాజల్కు ఇలాంటి ప్రాజెక్టులో చిన్న పాత్ర అయినా దక్కడం గొప్పే అనుకోవాలి.
This post was last modified on July 6, 2026 9:05 am
డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట…
సూర్యకు ఈ ఏడాది బాగానే కలిసి వస్తోంది. ‘వీరభద్రుడు’ తర్వాత ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా మంచి రన్లో…
గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి అధికారంలో ఉన్న…
‘ఇరుముడి’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘మల్లెపూల పల్లకి’ పాట వచ్చేసింది. అయ్యప్ప భక్తులకు ఈ పాట కొత్తది కాదు.…
ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యారు. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ…
‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు సానా నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న…