ప్రభాస్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘సలార్’ అనౌన్స్మెంట్తోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. ఎందుకంటే ‘కేజీఎఫ్’తో సంచలనం రేపిన ప్రశాంత్ నీల్ దీనికి దర్శకుడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, క్యాప్షన్.. ఇలా అన్నీ కూడా ప్రభాస్ అభిమానులకు, మాస్కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ అత్యంత వేగంగా చేయబోతున్న సినిమా ఇది. ఈ నెలాఖర్లోనే సినిమాను మొదులపెట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలన్నది ప్రభాస్ ప్రణాళిక. ‘సలార్’ ఈ ఏడాదే విడుదలైపోయినా ఆశ్చర్యం లేదు.
‘బాహుబలి’ నుంచి ప్రభాస్ సినిమాలన్నింటి లాగే ఇదీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతోంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే ఇక సౌత్ ఇండియాలో ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేసినట్లే. బాలీవుడ్లో ఈ సినిమాను మరింతగా మార్కెట్ చేయడం కోసం ప్రధాన పాత్రలకు అక్కడి నటులనే తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ప్రశాంత్.
ఇప్పటికే ‘సలార్’ కోసం కథానాయికగా బాలీవుడ్ భామ దిశా పటానిని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ హాట్ భామ.. ఇలాంటి యాక్షన్ మూవీకి పర్ఫెక్ట్ అని, ప్రభాస్తో ఆమెకు జోడీ కూడా బాగుంటుందని అంటున్నారు. కాగా ఇప్పుడు ‘సలార్’ కోసం విలన్ని కూడా ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం.. ఈ చిత్రంలో ప్రభాస్ను ఢీకొట్టబోతున్నాడట. ప్రభాస్ను మ్యాచ్ చేయాలంటే ఎదురుగా అతడి లాంటి మ్యాచో స్టార్ ఉంటేనే బాగుంటుంది. జాన్ అబ్రహాం అందుకు పర్ఫెక్ట్ అనడంలో సందేహం లేదు.
‘ఆదిపురుష్’లో ప్రభాస్కు విలన్గా సైఫ్ అలీఖాన్ను ఎంపిక చేయడంపై అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమైంది కానీ.. ‘సలార్’ కోసం జాన్ ఓకే అయితే మాత్రం అలాంటి ఫీలింగ్ కలగకపోవచ్చు. అతను ఇప్పటికే ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్కు విలన్గా నటిస్తుండటం విశేషం. ఇదే సమయంలో ‘సలార్’కు కూడా విలన్గా ఓకే అయితే ఈ సినిమాకు క్రేజ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…