లాక్ డౌన్ టైంలో దక్షిణాది సినీ పరిశ్రమలో బాగా చర్చనీయాంశం అయిన పేరు.. వనిత విజయ్ కుమార్. దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయ్కుమార్ల తనయురాలైన ఈమె.. తెలుగులో దేవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఇప్పటికే మూడుసార్లు పెళ్లయింది. మూడు బంధాలు చెడిపోయాయి. చివరగా లాక్ డౌన్ టైంలో పీటర్ అనే ఫిలిం మేకర్ను ఆమె పెళ్లి చేసుకోవడం.. దీనిపై పీటర్ భార్య గొడవ చేయడం.. పీటర్కు, వనితకు మధ్య కొన్ని రోజులకే విభేదాలు తలెత్తడం తెలిసిన సంగతే.
ఐతే ఈ పెళ్లిపై ఇప్పటిదాకా ఓపెన్గా మాట్లాడని వనిత.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు పీటర్తో జరిగింది పెళ్లే కాదని అన్న ఆమె.. తన వైవాహిక జీవితం సరిగా సాగకపోవడానికి తల్లిదండ్రులదే బాధ్యత అని విమర్శించడం గమనార్హం. ఇంకా ఈ విషయమై ఆమె ఏమందంటే..
దక్షిణాది సినీ రంగంలో దిగ్గజాలైన రజినీకాంత్, చిరంజీవి లాంటి వాళ్లు తమ కూతుళ్ల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని మంచివాళ్లను చూసి మళ్లీ పెళ్లి చేశారని.. కానీ తన తల్లిదండ్రులు అలా చేయలేదని వనిత ఈ ఇంటర్వ్యూలో ఆరోపించింది. చిన్న వయసులోనే తనకు పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారని.. తన ఇబ్బందులను వాళ్లు అర్థం చేసుకోలేదని.. భర్తతో తనకు గొడవలు వచ్చి విడిపోయినా.. పరువు కోసం మళ్లీ తనను అతడి దగ్గరికే పంపించేవారని.. ఇలా చాలా సార్లు జరిగిందని వనిత వాపోయింది.
రజినీకాంత్, చిరంజీవిలాగా అర్థం చేసుకుని ఉంటే.. ఈ రోజు తన లైఫ్ మరోలా ఉండేదని ఆమె అంది. తాను జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఈ మధ్య తాను పెళ్లి విషయంలో పెద్ద రాంగ్ స్టెప్ వేశానని.. అది అసలు పెళ్లే కాదని ఆమె వ్యాఖ్యానించింది. వనిత.. ప్రస్తుతం పీటర్కు దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆస్తి వివాదంల విషయమై ఒక సందర్భంలో తండ్రి విజయ్ కుమార్ను రోడ్డు మీదికి లాగి ఆమె గొడవకు దిగడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
This post was last modified on January 6, 2021 10:12 am
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…