మూడో పెళ్లిపై వనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


లాక్ డౌన్ టైంలో ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో బాగా చ‌ర్చ‌నీయాంశం అయిన పేరు.. వనిత విజ‌య్ కుమార్. దివంగ‌త న‌టి మంజుల‌, సీనియ‌ర్ న‌టుడు విజ‌య్‌కుమార్‌ల త‌న‌యురాలైన ఈమె.. తెలుగులో దేవి సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమెకు ఇప్ప‌టికే మూడుసార్లు పెళ్ల‌యింది. మూడు బంధాలు చెడిపోయాయి. చివ‌ర‌గా లాక్ డౌన్ టైంలో పీట‌ర్ అనే ఫిలిం మేక‌ర్‌ను ఆమె పెళ్లి చేసుకోవ‌డం.. దీనిపై పీట‌ర్ భార్య గొడ‌వ చేయ‌డం.. పీట‌ర్‌కు, వ‌నిత‌కు మ‌ధ్య‌ కొన్ని రోజుల‌కే విభేదాలు త‌లెత్తడం తెలిసిన సంగ‌తే.

ఐతే ఈ పెళ్లిపై ఇప్ప‌టిదాకా ఓపెన్‌గా మాట్లాడ‌ని వ‌నిత‌.. ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు పీట‌ర్‌తో జ‌రిగింది పెళ్లే కాద‌ని అన్న ఆమె.. త‌న వైవాహిక జీవితం స‌రిగా సాగ‌క‌పోవ‌డానికి త‌ల్లిదండ్రుల‌దే బాధ్య‌త అని విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. ఇంకా ఈ విష‌య‌మై ఆమె ఏమందంటే..

ద‌క్షిణాది సినీ రంగంలో దిగ్గ‌జాలైన‌ రజినీకాంత్‌, చిరంజీవి లాంటి వాళ్లు త‌మ కూతుళ్ల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని మంచివాళ్లను చూసి మళ్లీ పెళ్లి చేశారని.. కానీ త‌న‌ తల్లిదండ్రులు అలా చేయలేదని వ‌నిత ఈ ఇంట‌ర్వ్యూలో ఆరోపించింది. చిన్న వయసులోనే త‌న‌కు పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారని.. త‌న ఇబ్బందులను వాళ్లు అర్థం చేసుకోలేద‌ని.. భర్తతో త‌న‌కు గొడవలు వచ్చి విడిపోయినా.. పరువు కోసం మళ్లీ త‌న‌ను అత‌డి ద‌గ్గ‌రికే పంపించేవార‌ని.. ఇలా చాలా సార్లు జరిగిందని వ‌నిత వాపోయింది.

రజినీకాంత్‌, చిరంజీవిలాగా అర్థం చేసుకుని ఉంటే.. ఈ రోజు త‌న‌ లైఫ్‌ మరోలా ఉండేదని ఆమె అంది. తాను జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని.. ఈ మ‌ధ్య తాను పెళ్లి విషయంలో పెద్ద రాంగ్‌ స్టెప్‌ వేశానని.. అది అసలు పెళ్లే కాదని ఆమె వ్యాఖ్యానించింది. వ‌నిత‌.. ప్ర‌స్తుతం పీట‌ర్‌కు దూరంగానే ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆస్తి వివాదంల విష‌యమై ఒక సంద‌ర్భంలో తండ్రి విజ‌య్ కుమార్‌ను రోడ్డు మీదికి లాగి ఆమె గొడ‌వ‌కు దిగ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.