Movie News

నిధిని ఇబ్బంది పెట్టడంపై దర్శకుడి వివరణ


విశాల్‌తో తీసిన పల్నాడు, జయసూర్య లాంటి సినిమాల ద్వారా తెలుగు వారికీ పరిచయమున్న తమిళ దర్శకుడు సుశీంద్రన్.. ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నాడు. శింబు హీరోగా తెరకెక్కించిన కొత్త సినిమా ‘ఈశ్వరన్’ ఆడియో వేడుకలో వేదిక మీద హీరోయిన్ నిధి అగర్వాల్‌తో అతను వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నిధి మాట్లాడుతుండగా.. పక్కనే నిలబడి ‘శింబు మామా ఐ లవ్యూ’ అనాలని బలవంతం చేయడమే కాకుండా.. ఆమెకు మాట్లాడే ఛాన్సే ఇవ్వకుండా.. అలా మాట్లాడు, ఇలా మాట్లాడు అంటూ ఆమెను బలవంతం పెట్టడం, నిధి కొంచెం చిరాగ్గా హావభావాలు పెట్టడం చర్చనీయాంశమైంది. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హీరోను, అతడి అభిమానులను మెప్పించేందుకు ఓ దర్శకుడు ఇంతగా దిగజారాలా అంటూ సుశీంద్రన్‌ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు. కొందరు మీడియా వ్యక్తులు సైతం ఈ వీడియో పెట్టి సుశీంద్రన్ తీరును ఖండించారు. దీంతో సుశీంద్రన్ ఈ ఉదంతంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

హీరోయిన్ నిధి అగర్వాల్‌ను పక్కన కూర్చెబెట్టుకుని అతను ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదంపై తన వివరణ ఇచ్చాడు. ‘ఈశ్వరన్’ సినిమాలో నిధి పాత్ర స్వభావానికి తగ్గట్లే తాను ఆడియో వేడుకలో మాట్లాడినట్లు సుశీంద్రన్ చెప్పాడు. సినిమాలో ఆ పాత్ర ‘‘మామా ఐ లవ్యూ.. మామా ఐ లవ్యూ’’ అంటూ హీరో వెంట తిరుగుతుంటుందని.. అందుకు అనుగుణంగానే తాను ఆడియో వేడుకలో నిధితో ఆ డైలాగ్ చెప్పించే ప్రయత్నం చేశానని అతనన్నాడు. అంతకుమించి తనకు వేరే ఉద్దేశాలేమీ లేవని.. ఆమెను ఇబ్బంది పెట్టాలనుకోలేదని.. ఈ వీడియో చూసి కొందరి మనసులు గాయపడ్డాయని.. అలా బాధ పడ్డ వాళ్లకు తాను క్షమాపణ చెబుతున్నానని సుశీంద్రన్ తెలిపాడు.

పక్కనే ఉన్న నిధి కూడా సుశీంద్రన్‌కు వేరే ఉద్దేశాలేమీ లేవని అతడికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసింది. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో పేరు తెచ్చుకున్న నిధికి ఇదే తొలి తమిళ చిత్రం కావడం విశేషం. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ‘ఈశ్వరన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on January 5, 2021 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

38 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago