స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ దానికి భిన్నంగా కనిపిస్తోంది. రెండు కంటెంట్ నమ్ముకున్న సినిమాలు, అవి కూడా డైరెక్టర్ ఇమేజ్ మీద ఎక్కువ బిజినెస్ చేయలేని పరిస్థితిలో ప్రమోషన్లు, ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేసుకున్నాయి. వాటిలో మొదటిది రావు బహదూర్. సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ డ్రామాకు మహేష్ బాబు నిర్మాణ భాగస్వామి కావడం అసలు విశేషం.
సత్యదేవ్ ని ఏకంగా కమల్ హాసన్ తో పోల్చే రేంజ్ లో దర్శకుడు వెంకటేష్ మహా ఎలివేషన్ ఇవ్వడంతో అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్ కి భిన్నంగా టిపికల్ క్యారెక్టరైజేషన్ లో సత్యదేవ్ చూపించే షేడ్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయని అంటున్నారు. స్క్రీన్ ప్లేలో తన మార్కు ప్రయోగం కేరాఫ్ కంచెరపాలెంలో చూపించిన వెంకటేష్ మహా ఈసారి దానికి పదింతలు కనికట్టు చేయబోతున్నారని నిర్మాతలు బల్లగుద్ది చెబుతున్నారు.
క్లిక్ అయితే సంతోషమే. ఎంతసేపూ మలయాళం మూవీ మేకింగ్ ని భుజాన మోసే తెలుగు యువతకు రావు బహదూర్ రూపంలో ఒక సమాధానం దొరుకుతుంది. నాగబంధం విషయానికి వస్తే అబ్బురపరిచే గ్రాఫిక్స్ తీసుకుని అనంత పద్మనాభస్వామి స్ఫూర్తితో రాసుకున్న ఫాంటసీ కథ ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో హైప్ తీసుకొచ్చింది. హీరో విరాట్ కర్ణ ఇమేజ్ మార్కెట్ లో జీరో అయినప్పటికీ దర్శకుడు అభిషేక్ నామా కంటెంట్ వల్ల జనాల్లో ఇంటరెస్ట్ రేగుతోంది.
ఈ రెండు సినిమాలకు పబ్లిక్ టాక్, రివ్యూలు చాలా కీలకం కాబోతున్నాయి. ఓపెనింగ్స్ భారీగా వస్తాయని చెప్పలేం కానీ బాగుందనే టాక్ వస్తే సాయంత్రం షోల నుంచే సీన్ మారిపోయి హౌస్ ఫుల్ బోర్డులు పడతాయి. ఆ మాట చాలా కీలకం. ఏ మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నా ఆ ప్రభావం వెంటనే కనిపిస్తుంది. మా ఇంటి బంగారం క్రమంగా నెమ్మదిస్తున్న తరుణంలో ఆ అవకాశాన్ని రావు బహదూర్, నాగబంధం ఒడిసిపట్టుకోవాలి. ముందు రోజే రెండింటికి ప్రీమియర్లు వేసేలా ప్లానింగ్ జరుగుతోంది.
This post was last modified on June 29, 2026 4:25 pm
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు.…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై…
ప్రేమలు సినిమాతో మమిత బైజు అనే అమ్మాయి ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అప్పటికే మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించినా..…