కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో అరంగేట్రంలోనే ఇటు ఇండస్ట్రీని, అటు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు వెంకటేష్ మహా. కానీ ఇంత గొప్ప సినిమా తర్వాత తన కెరీర్ ఆశించినంత వేగం పుంజుకోలేదు. రెండో చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీకి పరిమితమైంది. పైగా అది రీమేక్ కావడంతో మహాకు పెద్దగా క్రెడిట్ రాలేదు. ఆపై నిర్మాతగా మార్టిన్ లూథర్ కింగ్ చేశాడు. అదీ ఆడలేదు.
ఇలాంటి నేపథ్యం ఉన్న దర్శకుడు కమర్షియల్ సినిమాల గురించి ఒక డైరెక్టర్స్ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య దుమారం రేపాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ సహా కొందరు దర్శకులను కలుపుకుంటూ తాము అనుకుంటే అలాంటి సినిమాలు తీయడం పెద్ద విషయం కాదన్నట్లుగా కమర్షియల్ సినిమాలను ఉద్దేశించి అన్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు మహా.
అప్పటి వివాదం గురించి తన కొత్త సినిమా రావు బహదూర్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా స్పందించాడు. ఆ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను కట్ చేసి, తప్పుగా చూపించినట్లు మహా వివరించాడు. తాను కమర్షియల్ సినిమాలను ఏమీ అనలేదని.. వాటి మీద తనకు గౌరవం ఉందని మహా చెప్పాడు. తాను ఆ ప్రోగ్రాంలో వాస్తవానికి విపరీతమైన హింస ఉండే సినిమాల గురించి విమర్శలు చేసినట్లు చెప్పాడు మహా
ఐతే ఆ విషయం కట్ చేశారని.. అంతే కాక తాము అలాంటి సినిమాలు తీయము అన్నది కట్ చేసి.. మధ్యలో అన్న కామెంట్ను మాత్రమే వీడియోలో చూపించారని.. దీంతో అందరూ తాను కమర్షియల్ సినిమాలను విమర్శించినట్లు భావించారని.. తనకు తెలిసిన వాళ్లు కూడా అపార్థం చేసుకుని తన పట్ల వ్యతిరేకత పెంచుకున్నారని, విమర్శలు చేశారని వెంకటేష్ మహా వివరించాడు. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా మహేష్ బాబు, ఛాయ్ బిస్కెట్ అధినేతలు కలిసి నిర్మించిన రావు బహదూర్ జులై 3న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 27, 2026 11:21 pm
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…