Movie News

ఇండస్ట్రీ సూపర్ అంటుంటే.. ఆ నటుడు మాత్రం

దేశంలో మరెక్కడా లేని విధంగా తమిళనాడులో మాత్రం థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. దీని పట్ల కోలీవుడ్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ సహా వేరే ఇండస్ట్రీల వాళ్లు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సినీ పరిశ్రమకు ఇది గొప్ప ఊతాన్నిచ్చేదిగా పేర్కొంటున్నారు. తమ దగ్గరా ఇలాగే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడిపేందుకు అనుమతులిస్తే బాగుంటందని చూస్తున్నారు.

ఈ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలూ జరిగే అవకాశముంది. ఐతే తమిళ సినీ పరిశ్రమలో అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వాన్ని పొగిడేస్తుంటే.. ఒక నటుడు మాత్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్య చేసి వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఆ నటుడే.. అరవింద్ స్వామి.

‘‘కొన్ని సందర్భాల్లో 100 శాతం కంటే 50 శాతమే ఎంతో మెరుగ్గా అనిపిస్తుంది. ఇది అలాంటి సమయమే’’ అని అరవింద్ స్వామి ట్విట్టర్లో వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాట థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే అరవింద్ ఈ ట్వీట్ చేశాడు. ఇది చూసి ఇండస్ట్రీ జనాలు షాకయ్యారు. ఓ వైపు ఇండస్ట్రీ ప్రముఖులందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పొగుడూ ట్వీట్లు వేస్తున్న సమయంలో అరవింద్ ఇలాంటి ట్వీట్ వేయడమేంటి అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఐతే కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశమిచ్చి.. ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రాన్ని విడుదల చేస్తే.. పూర్వపు రోజుల్లో మాదిరి థియేటర్లన్నీ కిక్కిరిసిపోయి వైరస్ ప్రభావం కచ్చితంగా పెరుగుతుందనే ఆందోళన నేపథ్యంలోనే అరవింద్ ఈ ట్వీట్ వేశాడని అర్థమవుతోంది. అందుకే అతను ధైర్యంగా ఇలాంటి ట్వీట్ పెట్టడాన్ని సమర్థిస్తున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

This post was last modified on January 5, 2021 1:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

16 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

56 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago