దేశంలో మరెక్కడా లేని విధంగా తమిళనాడులో మాత్రం థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. దీని పట్ల కోలీవుడ్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ సహా వేరే ఇండస్ట్రీల వాళ్లు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సినీ పరిశ్రమకు ఇది గొప్ప ఊతాన్నిచ్చేదిగా పేర్కొంటున్నారు. తమ దగ్గరా ఇలాగే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడిపేందుకు అనుమతులిస్తే బాగుంటందని చూస్తున్నారు.
ఈ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలూ జరిగే అవకాశముంది. ఐతే తమిళ సినీ పరిశ్రమలో అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వాన్ని పొగిడేస్తుంటే.. ఒక నటుడు మాత్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్య చేసి వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఆ నటుడే.. అరవింద్ స్వామి.
‘‘కొన్ని సందర్భాల్లో 100 శాతం కంటే 50 శాతమే ఎంతో మెరుగ్గా అనిపిస్తుంది. ఇది అలాంటి సమయమే’’ అని అరవింద్ స్వామి ట్విట్టర్లో వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాట థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే అరవింద్ ఈ ట్వీట్ చేశాడు. ఇది చూసి ఇండస్ట్రీ జనాలు షాకయ్యారు. ఓ వైపు ఇండస్ట్రీ ప్రముఖులందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పొగుడూ ట్వీట్లు వేస్తున్న సమయంలో అరవింద్ ఇలాంటి ట్వీట్ వేయడమేంటి అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు.
ఐతే కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశమిచ్చి.. ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రాన్ని విడుదల చేస్తే.. పూర్వపు రోజుల్లో మాదిరి థియేటర్లన్నీ కిక్కిరిసిపోయి వైరస్ ప్రభావం కచ్చితంగా పెరుగుతుందనే ఆందోళన నేపథ్యంలోనే అరవింద్ ఈ ట్వీట్ వేశాడని అర్థమవుతోంది. అందుకే అతను ధైర్యంగా ఇలాంటి ట్వీట్ పెట్టడాన్ని సమర్థిస్తున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
This post was last modified on January 5, 2021 1:40 pm
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…
ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…
షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి సహా మరికొందరికి తాజాగా నాంపల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…