తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద ఆధారపడుతుంటారు. పెద్ద హీరోలు నటించే భారీ బడ్జెట్ చిత్రాలంటే కచ్చితంగా వేరే భాషకు చెందిన సినిమాటోగ్రాఫర్ ఉండాల్సిందే. ముఖ్యంగా కోలీవుడ్ నుంచి ఛాయాగ్రాహకులను అరువు తెచ్చుకోవడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే.
రవివర్మన్, రవి.కె.చంద్రన్, రత్నవేలు, తిరు.. ఇలా ఎందరో లెజెండరీ సినిమాటోగ్రాఫర్లు తమిళం నుంచే వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. తెలుగు సినిమాటోగ్రాఫర్లను తెలుగులో చిన్న సినిమాలకే పెట్టుకుంటూ ఉంటారు. వేరే భాషల్లో మన వాళ్లకు అవకాశాలు దక్కడం అరుదు. అలాంటిది ఇప్పుడో భారీ తమిళ చిత్రానికి తెలుగు సినిమాటోగ్రాఫర్ పని చేయబోతున్నాడు. ఆ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ కాగా.. దానికి పని చేయబోతున్న తెలుగు సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన నికేత్.. నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’తో ఫీచర్ ఫిలిం సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, యుటర్న్, అంటే సుందరానికి, 35-చిన్న కథ కాదు లాంటి తెలుగు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించాడు. తమిళంలో అతడికి సూర్య లాంటి పెద్ద హీరోతో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా చేసే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుని అద్భుతమైన విజువల్స్ అందించాడు. తర్వాత డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతోనూ ప్రతిభను చాటుకున్నాడు.
‘డ్రాగన్’ చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తునే ఇప్పుడ రజినీ సినిమా ‘ధర్మన్’కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమా కదా అని పెద్ద సినిమాటోగ్రార్ల కోసం చూడకుండా నికేత్ టాలెంటును నమ్మి ఈ మెగా మూవీలో అతడికి ఛాన్సిచ్చాడు అశ్వత్. కమల్ నిర్మాణంలో రజినీ నటించే సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో, దాని రీచ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలోనూ తన టాలెంట్ చూపించాడంటే నికేత్ టాప్ సినిమాటోగ్రాఫర్ల లీగ్లోకి వెళ్లిపోవడం ఖాయం.
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…
తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…