వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు సినిమా విడుదల ఇంకా ఏడాది ఉండగానే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్నాయి. ఛాన్స్ దొరికితే చాలు ఈ మూవీ గురించి చెప్పే అవకాశాన్ని పృథ్విరాజ్ వదులుకోవడం లేదు. ఇందులో మెయిన్ విలన్ కుంభగా చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఎగ్జైట్ మెంట్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.
తాజాగా పృథ్విరాజ్ సుకుమారన్ ఒక విశేషం పంచుకున్నారు. అదేంటంటే ఉదయం నుంచి రాత్రి దాకా కేవలం ఒక షాట్ కోసం తొంభై దాకా టేకులు తీసుకుని అది సంతృప్తికరంగా రాకపోవడంతో ఆ రోజుకి షూటింగ్ ప్యాకప్ చెప్పేశారట. అది మహేష్ బాబు మీద నడిచే సీన్. బాగా వస్తున్నప్పటికీ తాను కోరుకున్న పర్ఫెక్షన్ వచ్చేదాకా జక్కన్న ఎంతగా ఆర్టిస్టులను సతాయిస్తారో ఆర్ఆర్ఆర్ టైంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటాలను గుర్తు చేసుకోవచ్చు. అంత పని రాక్షసుడు ఆయన.
బడ్జెట్, స్కేల్ పరంగా ఎవరూ ఊహించనంత గొప్పగా వారణాసి ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్న పృథ్విరాజ్ సుకుమారన్ రాజమౌళి పనితనానికి మంత్రముగ్దుడు అయిపోయాడు. నిర్మాణ సంస్థ నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ రాకపోయినా ఇలా ఏదో ఒక రూపంలో వారణాసి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ విడుదల ఫిక్స్ చేసుకోవడంతో దానికి అనుగుణంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో రాజమౌళి చాలా బిజీగా ఉన్నారు.
థియేటర్ బిజినెస్ పరంగా వారణాసి ఎంత నెంబర్ నమోదు చేస్తుందనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ నాటికి ఏపీ తెలంగాణ మాత్రమే కాదు యావత్ దేశం మొత్తం వారణాసి ఫీవర్ లో ఊగిపోయేలా ఉంది. ఇంకా హక్కుల అమ్మకాలు మొదలుకాలేదు. చాలా సమయం ఉంది కాబట్టి నిర్మాత డాక్టర్ కెఎల్ నారాయణ తొందరపడే ఉద్దేశంలో లేరు. మహేష్ బాబు అభిమానులు సంవత్సరం ఎప్పుడెప్పుడు గడిచిపోతుందాని వెయిట్ చేస్తున్నారు.
This post was last modified on June 25, 2026 10:56 am
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…