కొన్నేళ్ల ముందు వరకు తెలుగులో రాశి ఖన్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది. తొలిప్రేమ చిత్రంతో నటిగానే మంచి గుర్తింపు సంపాదించింది. కానీ తర్వాత వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. అందం, అభినయం రెండూ ఉన్న ఈ అమ్మాయికి అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి.
కానీ అదే టైంలో వేరే భాషల్లో అడపా దడపా సినిమాలు చేస్తూ ఎప్పుడో ఒకసారి తెలుగులోనూ నటిస్తూ వస్తోంది రాశి. గత ఏడాది తెలుసు కదా మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూసింది కానీ.. అది ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతోనూ ఆమెకు షాక్ తగిలింది. ఇలా కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేని టైంలో రాశికి ఒక క్రేజీ మూవీలో నటించే అవకాశం దక్కింది. ఈసారి ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో మెరవబోతోంది.
రజినీ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ధర్మన్ సినిమాను బుధవారమే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ను కూడా లాంచ్ చేసిన చిత్ర బృందం… ప్రెస్ మీట్ పెట్టి కాస్ట్ అండ్ క్రూను అనౌన్స్ చేసింది. ఈ చిత్రంలో రాశితో పాటు సీనియర్ నటి సిమ్రన్ కూడా నటిస్తోంది.
సిమ్రన్ ఉందంటే.. రజినీకి జోడీగా ఆమెనే నటిస్తుందనడంలో సందేహం లేదు. కెరీర్ పీక్స్లో ఉండగా.. ఎందరో స్టార్లతో నటించినా రజినీకి మాత్రం జోడీగా నటించని సిమ్రన్.. లేటు వయసులో పేట మూవీలో ఆయన సరసన కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సూపర్ స్టార్తో జోడీ కడుతోంది.
మరి ఈ సినిమాలో రాశి ఖన్నా ఎలాంటి క్యారెక్టర్ చేస్తుందన్నది ఆసక్తికరం. వయసు తేడా దృష్ట్యా రజినీకి రాశి జోడీగా నటించే అవకాశం ఎంతమాత్రం లేదు. బహుశా కూతురిగా లేదంటే ఇంకేదైనా ముఖ్య పాత్రలో ఆమె కనిపించే అవకాశముంది. రజినీ ఇందులో డాక్టర్ పాత్ర చేయనున్నాడు. ఆయన దగ్గర పని చేసే జూనియర్ డాక్టర్గా కూడా ఆమె కనిపించొచ్చు.
హీరోయిన్ కాదు కాబట్టి.. రాశికి నటనకు ప్రాధాన్యం ఉన్న కీలక పాత్రే దక్కి ఉంటుందని ఆశించవచ్చు. అశ్వత్ మారిముత్తు సినిమాలను పరిశీలిస్తే లేడీ క్యారెక్టర్లకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి రాశికిది సూపర్ ఛాన్స్ అనొచ్చ. కెరీర్లో ఈ దశలో రజినీ మూవీలో సరైన పాత్ర పడితే.. రాశి కెరీర్ మళ్లీ మలుపు తిరిగే అవకాశముంది.
This post was last modified on June 25, 2026 4:15 am
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…