ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్ పాయింట్. ఒకరు ఓటిటి అని మరొకరు పైరసీ అని ఇలా ఎవరికి వారు దీనికి భాష్యాలు చెబుతూనే ఉంటారు. తాజాగా రామ్ చరణ్ ఒక పబ్లిక్ స్టేజి మీద తన అభిప్రాయాన్ని పంచుకుంటూ కోవిడ్ తర్వాత కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతార, పుష్ప 2 లాంటి సినిమాలు చూసేందుకు పబ్లిక్ తరలి వచ్చారని, ఇప్పటికీ మన దేశంలో చీప్ గా దొరికే వినోదం సినిమా అని చెప్పాడు.
అంతేకాదు పాప్ కార్న్ ధరలు ఇంకొంచెం తగ్గిస్తే మరింత మెరుగైన ఆక్యుపెన్సీలు చూడొచ్చని అన్నాడు. సినిమా టికెట్ రేట్లు అందుబాటులోనే ఉన్నాయనేది రామ్ చరణ్ అసలు ఉద్దేశం. తన లాజిక్స్ ని కొంచెం విశ్లేషిస్తే పూర్తిగా ఏకీభవించలేం. ఎందుకంటే పాప్ కార్న్ తినడం కోసమే సినిమాలకొచ్చే జనాలు తక్కువ. ఏసీ కోసమైనా వస్తారేమో కానీ తింటూ ఎంజాయ్ చేద్దామని భావించే సంఖ్య పది శాతం లోపే ఉంటుంది. అలాంటప్పుడు వాటిని పెంచినా తగ్గించినా విపరీతమైన తేడా ఉండదు.
ముందు కంట్రోల్ చేయాల్సింది టికెట్ రేట్లు. మన దేశంలో చీప్ ఎంటర్ టైన్మెంట్ ముమ్మాటికీ సినిమా కాదు. ఏపీ తెలంగాణ పక్కనపెడితే ఒడిస్సి అనే ఇంగ్లీష్ మూవీని ఐమాక్స్ లో చూడాలంటే ఆరు వందల నుంచి రెండు వేల రూపాయల దాకా ఖర్చు పెట్టుకోవాలి. బడ్జెట్ పేరు చెప్పి పెద్ది ప్రీమియర్ షోకు ఆరు వందలు తీసుకున్నారు, పది రోజుల పాటు 125 రూపాయల పెంపును వాడుకున్నారు. ఈ ధోరణి అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కించుకున్నది కాదు కదా.
పాప్ కార్న్ ధరలు తగ్గించడం మంచిదే. దానితో పాటు పెద్ద హీరోల సినిమాలకు కొంత నియంత్రణ కూడా అవసరం. బడ్జెట్లు, రెమ్యునరేషన్లు, గ్రాఫిక్స్, టైం ప్రకారం షెడ్యూల్స్ ఇలా ఎన్నో విషయాల్లో మార్పులు వస్తే నిర్మాత ఊపిరి పీల్చుకుంటాడు. రెండేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ప్యాన్ ఇండియా సినిమాలు ఒక్క టాలీవుడ్ లోనే ఆరేడు ఉన్నాయి. వాటికి బాద్యులు ప్రేక్షకులు కాదు. ముమ్మాటికీ హీరోలు దర్శకులే. సో పాప్ కార్న్ తో పాటు ఈ సమస్యలు కూడా పరిష్కారం అయితే థియేటర్లు ఇంకా పచ్చగా ఉంటాయి.
This post was last modified on June 22, 2026 11:04 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…