అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ఇవాళ అనౌన్స్ మెంట్ ఉంటుందని నిన్నే తెలిసినప్పటికీ డేట్ మీద అనుమానాలు అలాగే ఉండిపోయాయి. వాటికి చెక్ పెడుతూ కెవిఎన్ ప్రొడక్షన్స్ యష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో సమాంతరంగా రూపొందిన టాక్సిక్ భారీ బడ్జెట్ తో రూపొందింది.
ఇక్కడ చిక్కు ఏమిటంటే ఎలాగూ ప్యారడైజ్ తప్పుకుంది కాబట్టి తమకు ఇబ్బంది లేదని భావించిన ఇతర సినిమాలకు సమస్య వచ్చినట్టే. ఎందుకంటే అదే రోజు శర్వానంద్ భోగి ఎప్పుడో లాక్ చేశారు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో నేరుగా టాక్సిక్ తో క్లాష్ అంటే బయట రాష్ట్రాల్లో స్క్రీన్ షేరింగ్ ఇబ్బందవుతుంది. రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 వస్తుంది. అంటే కేవలం అయిదు రోజుల ముందు. మైత్రి ఏపీ తెలంగాణతో పాటు దక్షిణాది బిజినెస్ మీద భారీ ఆశలు పెట్టుకుంది.
ఇప్పుడు టాక్సిక్ వస్తుంది కాబట్టి వీళ్ళేం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో యష్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. చాలా ఇంటెన్స్ రివెంజ్ డ్రామా ఉంటుందని, యాక్షన్ ఎపిసోడ్లకు ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయమని టీమ్ నమ్మకంగా చెబుతోంది. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి లాంటి క్రేజీ లేడీ క్యాస్టింగ్ ఇందులో భాగం కావడం విశేషం.
త్వరలోనే ప్రమోషన్లు వేగవంతం చేయబోతున్నారు. యష్ ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో సవాళ్ళను తీసుకున్నాడు. ఖర్చు చేయి దాటిపోతున్నా సరే ఏ మాత్రం నెరవకుండా కెవిఎన్ సంస్థ వందల కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు. తెలుగులో దిల్ రాజు ద్వారా టాక్సిక్ పంపిణి కాబోతోంది. దీని ఫలితాన్ని బట్టే నెక్స్ట్ ఎవరితో చేయాలనే దాని మీద యష్ నిర్ణయం తీసుకోబోతున్నాడు. . యష్ నటించిన మరో ప్యాన్ ఇండియా మూవీ రామాయణ నవంబర్ లో వస్తుంది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…