కలిసొస్తే కాలమొస్తే బ్లాక్బస్టర్ నడిచి వస్తుందని… అల్లు అర్జున్ ఇప్పుడు ఏది ప్లాన్ చేసినా బంగారమే అవుతోంది. అల వైకుంఠపురములో చిత్రం కరోనా రాకముందే రిలీజ్ అయిపోయి బ్రహ్మాండమయిన విజయం సాధించింది. అల్లు అర్జున్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆ సినిమా రిలీజ్ టైమింగ్ పెద్ద ప్లస్ అని చెప్పాలి. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు హిట్టవుతున్నాయి కానీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ లాంటి సూపర్స్టార్ల కాంబినేషన్ నుంచి రావడంతో ఆ సినిమా రేంజ్ మరింత పెరిగిపోయింది.
ఇదిలావుంటే కరోనా లాక్డౌన్ తర్వాత సినిమాల ట్రెండు మారిపోయింది. ఈ టైమ్లో సినీ ప్రియులు ఎన్నెన్నో విదేశీ చిత్రాలను, పరభాషా సినిమాలను చూసేసారు. సినిమా అంటే కేవలం వినోదం కాదు, వైవిధ్యం అని కూడా అర్థం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు వచ్చే సినిమాలనుంచి అదే ఆశిస్తున్నారు. ఈ ట్రెండుకి తగ్గ సినిమా పుష్ప. అల్లు అర్జున్కి లక్కీగా ఈ సినిమా లాక్డౌన్కి ముందే సెట్ అయింది. కానీ లాక్డౌన్ తర్వాత రానున్న భారీ సినిమాలలో ఇదొక్కటే ఇప్పటి ట్రెండుకి తగ్గ సినిమా అనిపిస్తోంది. ఇది కానీ క్లిక్ అయితే ట్రెండు కూడా కలిసొచ్చి బన్నీకి మరో రీసౌండింగ్ బ్లాక్బస్టర్ ఖాయమవుతుంది.
This post was last modified on January 4, 2021 11:34 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…