ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో టైమ్లో జరిగిన కేసుకు సంబంధించి న్యాయస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం అనగా జూన్ 22న కోర్టు విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 రిలీజ్ రోజున దురదృష్టవశాత్తు సంఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ సమయంలో అభిమానుల రద్దీని అదుపు చేయలేకపోవడం వల్ల అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఊపిరాడక ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ను ఏ11 నిందితుడిగా చేర్చారు.
ఆ రోజు క్రౌడ్ మేనేజ్మెంట్లో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే కారణంతో థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో పర్సనల్ స్టాఫ్, ప్రైవేట్ బౌన్సర్లు కలిపి మొత్తం 23 మంది పేర్లను ఈ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన లీగల్ ప్రాసెస్ అంతా ఇప్పుడు చట్టబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి విచారణ అధికారులు పక్కా సాక్ష్యాలను కలెక్ట్ చేసి న్యాయస్థానం ముందు ఉంచారు.
సోమవారం నాడు హీరో కోర్టుకు హాజరైన తర్వాత ఈ విచారణకు సంబంధించి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం తరచుగా ముంబై కూడా వెళుతున్నారు. అయితే ఇప్పటికే బాధిత కుటుంబానికి అల్లు తనవైపు నుంచి సహాయం అందించాడు.
This post was last modified on June 19, 2026 2:41 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…