Movie News

కోర్టు మెట్లు ఎక్కనున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో టైమ్‌లో జరిగిన కేసుకు సంబంధించి న్యాయస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం అనగా జూన్ 22న కోర్టు విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 రిలీజ్ రోజున దురదృష్టవశాత్తు సంఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

ఆ సమయంలో అభిమానుల రద్దీని అదుపు చేయలేకపోవడం వల్ల అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఊపిరాడక ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ను ఏ11 నిందితుడిగా చేర్చారు.

ఆ రోజు క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే కారణంతో థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో పర్సనల్ స్టాఫ్, ప్రైవేట్ బౌన్సర్లు కలిపి మొత్తం 23 మంది పేర్లను ఈ ఛార్జ్ షీట్‌లో పొందుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన లీగల్ ప్రాసెస్ అంతా ఇప్పుడు చట్టబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి విచారణ అధికారులు పక్కా సాక్ష్యాలను కలెక్ట్ చేసి న్యాయస్థానం ముందు ఉంచారు.

సోమవారం నాడు హీరో కోర్టుకు హాజరైన తర్వాత ఈ విచారణకు సంబంధించి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం తరచుగా ముంబై కూడా వెళుతున్నారు. అయితే ఇప్పటికే బాధిత కుటుంబానికి అల్లు తనవైపు నుంచి సహాయం అందించాడు.

Kumar

Recent Posts

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

56 minutes ago

దురంధర్ విలన్ ‘ఇక్కా’ ఎలా ఉంది

ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…

1 hour ago

ధనుష్ మురుగన్… త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటో

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…

2 hours ago

అక్క రాజ్యం చూపిస్తానంటున్న కవిత

తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత విశ్వ‌రూపం చూపించారు. ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ``ఇప్ప‌టి వ‌ర‌కు మీరు అన్న‌..…

2 hours ago

‘భాగ్యశ్రీ’ భాగ్యరేఖ మారినట్టేనా

మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…

2 hours ago

‘భద్రాచలం రాముడి మీద ఆనా… ఈసారి కాంగ్రెస్ పార్టీకి 117!’

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌న్నారు.…

4 hours ago