టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం కూడా. చేతిలో ఆరేడు సినిమాలతో తను మాములు బిజీగా లేడు. ఇప్పుడు జివి ప్రకాష్ కుమార్ సైతం క్రేజీ ప్రోజెక్టులను తన ఖాతాలో వేసుకుంటూ జెండా పాతే ప్రయత్నం చేస్తున్నాడు. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా లాంచ్ అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’కి జివి మ్యూజిక్ చాలా కీలకం కానుందని దర్శకుడు అజయ్ భూపతి పలు సందర్భాల్లో నొక్కి మరీ చెబుతున్నారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్న సినిమా భాగస్వామ్యంలో రూపొందుతున్న ‘ఆకాశంలో ఒక తార’ మీద షూటింగ్ టైం నుంచే పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి. గత రెండు చిత్రాలు భీమ్స్ సిసిరోలియోకి ఇచ్చి బ్లాక్ బస్టర్స్ అందుకున్న రావిపూడి ఈసారి తీస్తున్న మల్టీస్టారర్ ” వెంకీ అనిల్ 5 ” కి జివిని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడితో ఆగకుండా ఆల్రెడీ ప్రమోషన్లలో వాడుకుంటున్న వైనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్ మీద నాగ వంశీ నిర్మిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. దీన్ని జివి నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’ చివరి దశలో ఉంది. సుహాస్ కోలీవుడ్ కు పరిచయమవుతున్న ‘మందాడి’ మీద బిజినెస్ పరంగా క్రేజ్ నెలకొంది. జానర్స్ పరంగా ఒకదానితో మరొకటి సంబంధం లేని సినిమాలు చేస్తున్న జివి ప్రకాష్ కు ఇవన్నీ సవాల్ విసిరేవే.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే రవితేజ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్న ‘ఇరుముడి’ ఇంకో ఎత్తు. గతంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపంలో జివి ఒక ఫ్లాప్ ఇచ్చాడు. కంటెంట్ బాలేకపోవడం పక్కనపెడితే మ్యూజిక్ కు కూడా పేరు రాలేదు. ఈసారి ఆ బాకీని ఇరుముడితో తీర్చాలని మాస్ మహారాజా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంత టైట్ షెడ్యూల్స్ లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే జివి మీద ఉంది. అది ఏ మేరకు నెరవేరుస్తారో కాలమే నిర్ణయిస్తున్నారు.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…