వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం తీసి ఆశ్చర్యపరిచారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఈ వయసులో సినిమా తీయడం ఒకెత్తయితే.. దాన్ని హిట్ చేయడం మరో ఎత్తు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సింగ్ గీతం’ ఈ తరం ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ హిట్ దిశగా సాగుతోంది.
40 ఏళ్ల కిందట సింగీతం ఇలాంటి ఆలోచన చేయడం.. ఇన్నేళ్లు ఆ ఐడియాను నమ్మి ఎదురు చూడడం.. ఈ తరం ప్రేక్షకులతోనూ ఇది కొత్తగా ఉంది అనిపించి సక్సెస్ చేయడం చిన్న విషయం కాదు. ఈ ఉత్సాహంలో ఆయన చెన్నైలోని తన ఇంటి నుంచి తెలుగు జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో తనకు నచ్చిన రెండు సినిమాల గురించి ఆయన వెల్లడించారు. అందులో సుకుమార్, అల్లు అర్జున్ల ‘పుష్ప-2’ ఉండడం విశేషం.
‘‘నన్ను ఈ మధ్య అత్యంత ఆకట్టుకున్న సినిమాలు.. పుష్ప-2, కాంతార. ప్రత్యేకంగా పుష్ప-2లో హీరో పాత్ర చిత్రణ నాకు చాలా నచ్చింది. ఇక కాంతార ఒక అద్భుతమైన సినిమా. ఆ సినిమాలో భావోద్వేగాలు , పాత్రల రూపకల్పన, కథనం ఎంతో బలంగా ఉన్నాయి’’ అని సింగీతం వ్యాఖ్యానించారు. కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలతో గొప్ప గొప్ప ప్రయోగాలు చేసిన దర్శకుడు మెచ్చాడంటే ఈ సినిమాల మేకర్స్ దాన్నో ఘనతగా భావించాల్సిందే.
ఇక తన సినిమా ‘సింగ్ గీతం’ గురించి మాట్లాడుతూ.. ఇది జెన్జీ కోసం రూపొందించిన సినిమా అని, వారికి ఇది నచ్చడం తనకెంతో ఆనందంగా ఉందని.. తన కెరీర్లో ఇది అత్యుత్తమ దశ అని ఆయన వ్యాఖ్యానించారు. కాల క్రమంలో ‘సింగ్ గీతం’ ఇంకా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ నాగ్ అశ్విన్దే అని ఆయన స్పష్టం చేశారు.
This post was last modified on June 17, 2026 12:47 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…