ఇండియాలో వివిధ భాషల్లో ఒకే కథాంశంతో తెరకెక్కి సూపర్ సక్సెస్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ అగ్ర భాగాన నిలుస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. రూ.30 కోట్ల లోపు మార్కెట్ ఉన్న మళయాల సినిమా స్థాయిని దృశ్యం ఏకంగా రూ.50 కోట్లు దాటించేసింది. అక్కడ ఆ స్థాయి గ్రాస్ సాధించిన తొలి చిత్రం అదే.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేస్తే అన్ని చోట్లా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కథను మొదలుపెట్టి కొత్త కథను చెప్పబోతున్నారిందులో. అంటే ఇది పక్కా సీక్వెల్ అన్నమాట. మొదలైన నెలన్నరలోనే ఈ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే విడుదల కాబోతోంది.
ఐతే ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమా విడుదల కానుంది. ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లినపుడు అందరి దృష్టీ సీక్వెల్ మీద నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేసి మంచి ఫలితాన్నందుకున్న వెంకటేష్ సీక్వెల్ను కూడా రీమేక్ చేయొచ్చని అనుకున్నారు. ఆయనకు రీమేక్ల్లో మంచి సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ‘దృశ్యం-2’ ఆడితే.. దాన్ని కూడా రీమేక్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సందేహాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే ‘దృశ్యం-2’ నేరుగా అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయబోతున్నారు. మలయాళ ‘దృశ్యం’ వచ్చినపుడు ఓటీటీల సందడి లేదు. పైగా మలయాళ సినిమాల మీద మనోళ్ల దృష్టి తక్కువే. కానీ ఇప్పుడు ఆ భాషా చిత్రాలకు బాగా అలవాటు పడ్డారు. అమేజాన్ ప్రైమ్ కూడా బాగా అలవాటైపోయింది. ‘దృశ్యం’కు సీక్వెల్ అనగానే తెలుగు వాళ్లు ఆ చిత్రాన్ని ఓటీటీలో పెద్ద ఎత్తున చూసే అవకాశముంది. ఇలా అందరూ చూసేశాక, కథేంటో తెలిసిపోయాక రీమేక్ చేసి పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి ‘దృశ్యం-2’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ దీన్ని వెంకీ రీమేక్ చేసే అవకాశాలు లేనట్లే.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…