Movie News

పవన్ హామీ ఇచ్చాడు.. ఇక ఫుల్ జోష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ మళ్లీ ఓ సినిమా తీయాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ మ్యాజికల్ కాంబినేషన్‌ను మళ్లీ చూడాలన్న అభిమానుల ఆశకు కొన్ని నెలల కిందటే జీవం వచ్చింది. పవన్, హరీష్ కలయికలో సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేసింది. కాకపోతే ఈ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.

రీఎంట్రీలో పవన్ మూడో సినిమాగా ఇదే ఉంటుందని అనుకున్నారు కానీ.. మధ్యలో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను పవన్ తెరపైకి తేవడం.. క్రిష్ సినిమా ఆలస్యం అవుతుండటంతో ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఐతే నూతన సంవత్సరాది సందర్భంగా పవన్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి హరీష్‌తో పాటు మైత్రీ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ వెళ్లారు.

ఈ సందర్భంగా తమ కలయికలో రావాల్సిన సినిమా గురించి హరీష్, రవిశంకర్‌లకు ఒక క్లారిటీ ఇచ్చేశాడట పవన్. ‘వకీల్ సాబ్’ పూర్తయిన నేపథ్యంలో తాను ఒకేసారి క్రిష్ సినిమాతో పాటు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లోనూ నటిస్తానని.. సాధ్యమైనంత త్వరగా ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేసి ఈ ఏడాదే.. హరీష్ దర్శకత్వంలో నటిస్తానని పవన్ హామీ ఇచ్చాడట.

పవన్‌తో మీటింగ్ ప్రొడెక్టివ్‌గా సాగిందని.. ఇదేదో సరదాకు జరిగిన మీటింగ్ కాదని.. ఒక భారీ ప్రాజెక్టుకు ఇది ఆరంభం అని ట్విట్టర్లో హరీష్ పేర్కొన్నాడు. తనకు వేరే ఆఫర్లు వచ్చినప్పటికీ.. తన ఎనర్జీ మొత్తం పవన్ సినిమా మీదే పెట్టాలని, డీవియేట్ కాకూడదనే ఉద్దేశంతో హరీష్.. ఈ ప్రాజెక్టుకే అంకితం అయ్యాడు. అతను గత ఏఢాదే స్క్రిప్టు కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు మరింతగా దానికి మెరుగులు దిద్దుకునే పనిలో ఉన్నాడు. మైత్రీ వాళ్ల నుంచి కొన్నేళ్ల కిందట అడ్వాన్స్ తీసుకున్న పవన్.. ఎట్టకేలకు వారికి సినిమా చేస్తున్నాడు.

This post was last modified on January 2, 2021 11:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

11 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

51 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago