తెలుగులో గోపీచంద్ హీరోగా శౌర్యం అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత గోపీచంద్తోనే అతను తీసిన శంఖం సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. తమిళంలో విక్రమార్కుడు రీమేక్ సిరుత్తైతో సూపర్ హిట్ కొట్టి అక్కడ దర్శకుడిగా స్థిరపడిపోయాడు శివ.
అజిత్ లాంటి పెద్ద హీరో అతడికి ఛాన్సివ్వగా.. వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్లు తీసి దర్శకుడిగా పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. కానీ విశ్వాసం తర్వాత శివకు ఏమాత్రం కలిసి రాలేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్తో చేసిన అన్నాత్తే పెద్ద డిజాస్టర్ అయి శివ పేరును బాగా చెడగొట్టింది. అయినా సరే సూర్య అతణ్ని నమ్మి భారీ బడ్జెట్లో కంగువ సినిమా చేశాడు. ఇది తమిళంలో రోబో-2 తర్వాత అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం. ఇది తమిళ సినీ రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి రిలీజ్ ముంగిట. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే అంచనాలన్నీ కూలిపోయాయి. తమిళంలో అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది కంగువ.
ఇక అప్పట్నుంచి శివకు ఇంకో సినిమా అవకాశం దక్కడం కష్టమైపోయింది. కంగువ-2 ప్లాన చేసుకున్నాడు కానీ.. కంగువ డిజాస్టర్ కావడంతో దాని జోలికి వెళ్లే అవకాశం లేకపోయింది. గతంలో మూడు సినిమాలకు అవకాశమిచ్చిన అజిత్ సహా ఏ స్టార్ హీరో అతడికి డేట్లు ఇవ్వలేదు. కానీ ఆశ్చర్యకరంగా ధనుష్.. శివ కథకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ధనుష్ అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. ఎప్పుడో కానీ మాస్ సినిమా చేయడు. అందులోనూ శివ లాంటి ఊర మాస్ దర్శకుల జోలికి అతను వెళ్లడు.
పైగా ఇప్పుడు శివ ఎలాంటి ఫాంలో ఉన్నాడో తెలిసిందే. ఈ దశలో శివతో ధనుష్ సినిమా ఊహించలేనిదే. ఐతే ధనుష్ వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఒకింత నిరాశకు గురి చేస్తున్న నేపథ్యంలో అభిమానులు అతడి నుంచి మంచి మాస్ మూవీ ఆశిస్తున్నారు.. ధనుష్ చివరి చిత్రం కర డిజాస్టర్ అయిన నేపథ్యంలో తన ఆలోచన మారినట్లుంది. మరి కంగువ ఫెయిల్యూర్ను మరిపించేలా ధనుష్తో హిట్టు కొట్టి శివ తనేంటో మళ్లీ రుజువు చేస్తాడేమో చూడాలి.
This post was last modified on June 6, 2026 8:26 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…