తెలుగులో గోపీచంద్ హీరోగా శౌర్యం అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత గోపీచంద్తోనే అతను తీసిన శంఖం సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. తమిళంలో విక్రమార్కుడు రీమేక్ సిరుత్తైతో సూపర్ హిట్ కొట్టి అక్కడ దర్శకుడిగా స్థిరపడిపోయాడు శివ.
అజిత్ లాంటి పెద్ద హీరో అతడికి ఛాన్సివ్వగా.. వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్లు తీసి దర్శకుడిగా పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. కానీ విశ్వాసం తర్వాత శివకు ఏమాత్రం కలిసి రాలేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్తో చేసిన అన్నాత్తే పెద్ద డిజాస్టర్ అయి శివ పేరును బాగా చెడగొట్టింది. అయినా సరే సూర్య అతణ్ని నమ్మి భారీ బడ్జెట్లో కంగువ సినిమా చేశాడు. ఇది తమిళంలో రోబో-2 తర్వాత అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం. ఇది తమిళ సినీ రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి రిలీజ్ ముంగిట. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే అంచనాలన్నీ కూలిపోయాయి. తమిళంలో అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది కంగువ.
ఇక అప్పట్నుంచి శివకు ఇంకో సినిమా అవకాశం దక్కడం కష్టమైపోయింది. కంగువ-2 ప్లాన చేసుకున్నాడు కానీ.. కంగువ డిజాస్టర్ కావడంతో దాని జోలికి వెళ్లే అవకాశం లేకపోయింది. గతంలో మూడు సినిమాలకు అవకాశమిచ్చిన అజిత్ సహా ఏ స్టార్ హీరో అతడికి డేట్లు ఇవ్వలేదు. కానీ ఆశ్చర్యకరంగా ధనుష్.. శివ కథకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ధనుష్ అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. ఎప్పుడో కానీ మాస్ సినిమా చేయడు. అందులోనూ శివ లాంటి ఊర మాస్ దర్శకుల జోలికి అతను వెళ్లడు.
పైగా ఇప్పుడు శివ ఎలాంటి ఫాంలో ఉన్నాడో తెలిసిందే. ఈ దశలో శివతో ధనుష్ సినిమా ఊహించలేనిదే. ఐతే ధనుష్ వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఒకింత నిరాశకు గురి చేస్తున్న నేపథ్యంలో అభిమానులు అతడి నుంచి మంచి మాస్ మూవీ ఆశిస్తున్నారు.. ధనుష్ చివరి చిత్రం కర డిజాస్టర్ అయిన నేపథ్యంలో తన ఆలోచన మారినట్లుంది. మరి కంగువ ఫెయిల్యూర్ను మరిపించేలా ధనుష్తో హిట్టు కొట్టి శివ తనేంటో మళ్లీ రుజువు చేస్తాడేమో చూడాలి.
ఏపీలో చేరికల పర్వం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందుగానే వైసీపీని ఖాళీ చేసే దిశగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆపరేషన్…
మీరు భారతీయులేనా?- ఈ సందేహం ఎందుకు? అనే డౌటు రావొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో ఇది…
మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం…
జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…