ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా గ్యాప్ తీసుకుని తన స్వీయ నిర్మాణంలో చేసిన సినిమా మా ఇంటి బంగారం జూన్ 19 విడుదలకు రెడీ అవుతోంది. నిజానికిది మే రెండో వారంలోనే రావాల్సింది. కానీ ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడం, ప్రాజెక్టుని పర్యవేక్షిస్తున్న సామ్ భర్త రాజ్ నిడిమోరు సలహా మేరకు ఆగిపోయారు. అదే సమయంలో సూర్య కరుప్పు రిలీజయ్యింది.
ఊహించని విధంగా అది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒకవేళ మా ఇంటి బంగారం కనక దాంతో క్లాష్ అయ్యి ఉంటే సామ్ తమిళ వెర్షన్ కు ఇబ్బందులు వచ్చేవి. ఆ రకంగా సేఫ్ గేమ్ ఆడారని చెప్పాలి. అదే సమయంలో నైజామ్ లో సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ గొడవ జరుగుతోంది. అదో సమస్యగా మారేది. ఇవేవి లేకుండా ప్రశాంతంగా జూన్ 19కి వెళ్లిపోవడం మేలే చేసింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అదే రామ్ చరణ్ పెద్ది.
పలు వాయిదాల తర్వాత మెగా పవర్ స్టార్ థియేటర్లలో అడుగుపెట్టారు. రెస్పాన్స్, పబ్లిక్ టాక్స్ బాగానే ఉన్నాయి. కొంత మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ తర్వాత సాలిడ్ గా నిలబడుతుందని ట్రేడ్ నమ్ముతోంది. అయితే ఎంత రన్ వచ్చినా రెండు వారాల తర్వాత నెమ్మదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప 2 లాంటి యునివర్సల్ మాస్ అప్పీల్ ఉన్న సినిమా కాకపోవడంతో బిసి సెంటర్స్ లో ఎంత మేర లాంగ్ రన్ వస్తుందనేది వేచి చూడాలి.
మా ఇంటి బంగారంకు పెద్ద కాంపిటీషన్ సమస్య లేదు. దీవానాని గీత ఆర్ట్స్ గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు కానీ అది ఇంటెన్స్ లవ్ స్టోరీ కాబట్టి సామ్ కు ఎలాంటి చిక్కు ఉండదు. జానర్ పరంగాన పోలికలు వచ్చే ప్రసక్తే ఉండదు. అయితే వారం తర్వాత అఖిల్ లెనిన్ జూన్ 26 వచ్చేస్తుంది. ఈలోగా మా ఇంటి బంగారం మూవీకి యునానిమస్ టాక్ వస్తే ఎంత కాంపిటీషన్ వచ్చినా నిలదొక్కుకోవచ్చు. దర్శకురాలు నందిని రెడ్డికి ఇది హిట్ కావడం చాలా అవసరం.
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…
అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…