అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల అనుభవమున్న ఏఅర్ రెహమాన్ పేరుని దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ చాలా అనుమాన పడ్డారు. ఎందుకంటే టాలీవుడ్ లో ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు కొమరం పులి పేరు చెబితే భయపడతారు. సినిమా బాగోకపోవడం పక్కనపెడితే కనీసం మంచి పాటలు ఉండవు.
ఆలాంటి రెహమాన్ పెద్దికి న్యాయం చేస్తాడా అనే డౌట్లు ఎట్టకేలకు పటాపంచలయ్యాయి. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ తో బోణీనే బలంగా స్టేడియం బయటికి కొట్టిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆ తర్వాత రైరై రారయ్ తో మరో బౌండరీ బాదారు. ఐటెం సాంగ్ ఆశించినంత పెద్ద స్థాయిలో లేకపోయినా మస్సా మస్సా ఆ లోటుని తీర్చేసింది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. ఓవర్ సౌండ్ లేకుండా చక్కగా ఇచ్చిన వైనం ఆకట్టుకుంది.
ఈ మధ్య ఎలివేషన్ల ట్రెండ్ లో డాల్బీ స్పీకర్లు బద్దలయ్యే రేంజ్ లో వాయిద్యాలు వాడటం కామన్ అయిపోయింది. కానీ రెహమాన్ వాటి జోలికి వెళ్ళలేదు. 1990 నాటి విజయనగరం బ్యాక్ డ్రాప్ కాబట్టి దానికి తగ్గట్టే అప్పటి మూడ్ ప్రతిబింబించేలా కంపాజ్ చేసిన విధానం కొత్తగా అనిపించింది. అక్కడక్కడా రెండు మూడు చోట్ల ఇంకాస్త మెరుగ్గా ఇచ్చి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది కానీ ఓవరాల్ గా చూసుకుంటే రెహమాన్ పెద్దికి పెద్ద బలమయ్యారు.
ఇకపై రెహమాన్ కు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లడం ఖాయం. అయితే తమిళంలోనే యమా బిజీగా ఉన్న ఆయన అంత ఈజిగా ఒప్పుకోకపోవచ్చు ఒకటో రెండో చేసే అవకాశాలు లేకపోలేదు. చిరంజీవి 158 కోసం తొలుత ఈ ఆప్షన్ పరిశీలించారట గాని తర్వాత ఏవో కారణాల వల్ల ఆ ఛాన్స్ తమన్ కు వెళ్లిందనే టాక్ బలంగానే ఉంది. ఏదైతేనేం ఎప్పుడూ చూడని విధంగా రెహమాన్ ఒక తెలుగు సినిమా ప్రమోషన్ కోసం చాలా కేర్ తీసుకున్నారు. దానికి తగ్గ ఫలితం వస్తే చాలు.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…