ఇండియన్ బాక్సాఫీస్లో ‘బాహుబలి’ సంచలనాలు చూశాక వివిధ పరిశ్రమల వాళ్లకు అలాంటి భారీ చిత్రం చేయాలని కోరిక పుట్టింది. మలయాళంలో ఇప్పటికే కొన్ని భారీ ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ఏ రకంగానూ ‘బాహుబలి’కి దరిదాపుల్లో నిలవలేకపోయాయి. ఐతే ఇప్పుడు మలయాళ పరిశ్రమలో బిగ్గెస్ట్ హీరో, బిగ్గెస్ట్ డైరెక్టర్ కలిసి ‘బాహుబలి’ తరహా భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రమే. ఆ ఇద్దరూ మోహన్ లాల్, ప్రియదర్శన్ కాగా.. వీరి కలయికలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మరక్కార్’. గత ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన సినిమా ఇది. విడుదలకు అంతా సిద్ధం చేశాక.. కరోనా వచ్చి అందుకు అవకాశం లేకుండా చేసేసింది. ఇటీవలే కేరళలో థియేటర్లు తెరుచుకోగా.. ఇంతటి భారీ చిత్రాన్ని 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో విడుదల చేయడం కరెక్ట్ కాదని ఆగుతున్నారు.
ఇండియాలో వ్యాక్సినేషన్కు జోరుగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో వేసవి సమయానికి దేశవ్యాప్తంగా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేసవి సీజన్ ఆరంభంలోనే ‘మరక్కార్’ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మార్చి 26న ‘మరక్కార్’ రిలీజ్ అంటూ ఒక గ్రాండ్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. మోహన్ లాల్తో ప్రియదర్శన్ 30కి పైగా సినిమాలు తీయడం విశేషం. ఐతే ఇన్నేళ్లలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ఒకెత్తయితే.. ‘మరక్కార్’ మరో ఎత్తు. మలయాళంలో ఇప్పటిదాకా ఇంత పెద్ద బడ్జెట్లో ఏ సినిమా తెరకెక్కలేదు. సముద్రం మీద తన అనుచరులతో కలిసి బ్రిటిష్ సైన్యంతో పోరాడే ఓ భారత వీరుడి కథ ఇది. దీని టీజర్ చూస్తే హాలీవుడ్ ఫేమస్ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ ఛాయలు కనిపించాయి. ప్రపంచ సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గని భారీతనం, నిర్మాణ విలువలు సినిమాలో కనిపిస్తున్నాయి. విజువల్స్, ఎఫెక్ట్స్ అన్నీ భారీగానే ఉండేలా చూసుకున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే మలయాళ సినిమా రికార్డులను తిరగరాసే అవకాశముంది.
This post was last modified on January 2, 2021 8:34 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…