మహేష్ బాబు కెరీర్ను ‘ఒక్కడు’ సినిమాకు ముందు, ‘ఒక్కడు’ సినిమాకు తర్వాత అని విభజించి చూడాల్సిందే. దానికి ముందు హీరోగా నటించిన ‘రాజకుమారుడు’, ‘మురారి’ సినిమాలు పెద్ద విజయాలే సాధించినప్పటికీ ‘ఒక్కడు’ సూపర్ స్టార్కు గేమ్ చేంజర్ అయ్యింది. ఆ సినిమాతో యూత్లో, మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్.. తన బాక్సాఫీస్ స్టామినాను అమాంతం పెంచుకున్నాడు. తండ్రి నుంచి ‘సూపర్ స్టార్’ ట్యాగ్ను తీసుకునేందుకు అర్హత సాధించాడు. ఐతే ఇలాంటి బ్లాక్బస్టర్ అందించిన ఎం.ఎస్.రాజుతో మహేష్ మళ్లీ ఇంకో సినిమా చేయకపోవడం ఆశ్చర్యకరం. ఆయన మంచి ఫాంలో ఉండగా.. మళ్లీ మహేష్తో మరో సినిమా చేయడానికి ప్రయత్నించాడో లేదో తెలియదు. బేనర్ వాల్యూ పడిపోయాక రాజు అడిగినా.. మహేష్ రాజుతో పని చేయడానికి ఆసక్తి చూపించి ఉండకపోవచ్చేమో.
ఐతే కొన్నేళ్ల కిందటే ప్రొడక్షన్ ఆపేసి.. కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రాజు.. ఈ మధ్యే దర్శకుడిగా ‘డర్టీ హరి’ అనే బోల్డ్ సినిమాను అందించారు. ఆ సినిమాకు ఆర్థికంగా మంచి ఫలితమే దక్కింది. రాజు ఇంతకుముందు తీసిన సినిమాలతో పోలిస్తే కంటెంట్ పరంగానూ ఇది మెరుగ్గానే అనిపించింది. యువత అభిరుచిపై ఆయనకు పట్టుందన్న సంగతి ఈ సినిమాతో అర్థమైంది. ఈ ఊపులో మళ్లీ ప్రొడక్షన్లోనూ బిజీ కావాలనుకుంటున్న రాజు.. తాను మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాలున్నట్లు ట్విట్టర్లో సంకేతాలు ఇవ్వడం విశేషం. మహేష్తో సినిమా ఉంటుందా అని ఓ నెటిజన్ ఆయన్ని అడిగితే.. తప్పకుండా అని రాజు చెప్పాడు. మహేష్తో సినిమా చేస్తే ‘ఒక్కడు-2’నే తీయండి, గుణశేఖర్నే దర్శకుడిగా పెట్టుకోండి అని ఓ నెటిజన్ అంటే.. ‘‘అంతేగా’’ అని బదులిచ్చాడు రాజు. మరి మహేష్తో ఒక్కడు-2 ఎఫ్పుడు మొదలుపెడతారని మరో నెటిజన్ అడిగితే.. ఇంకో నెల రోజుల్లో వివరాలు చెబుతా అన్నారు రాజు. మరి నిజంగా ఒక్కడు కాంబినేషన్ను రాజు రిపీట్ చేయగలిగాడంటే టాలీవుడ్లో అదో సెన్సేషనల్ న్యూస్ అవుతుందనడంలో సందేహం లేదు.
నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్…
ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం…
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…