మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన వసూళ్లు ట్రేడ్ ని షాక్ కు గురి చేశాయి. ఆ టైంలో వచ్చిన కొత్త మూవీస్ దీని వల్ల ఇబ్బంది పడటం ఊహించని పరిణామం. రామ్ చరణ్ ఆరంజ్ కూడా ఇదే తరహాలో మేజిక్ చేయడం నిర్మాత నాగబాబుకి ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రతిసారి ఇలా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. దానికి ఉదాహరణ తాజాగా వచ్చిన అతిథి.
ఈ నెల 31 సూపర్ స్టార్ కృష్ణగారి జయంతిని పురస్కరించుకుని అతిథిని ప్రత్యేకంగా రీ మాస్టర్ చేసి ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో కొన్ని సింగల్ స్క్రీన్స్ లో తప్ప మిగిలిన చోట ఆశించిన స్పందన లేదన్నది వాస్తవం. ఓవర్సీస్ లో సైతం కలెక్షన్లు తీసికట్టుగా ఉన్నాయి. మహేష్ బలమైన కోటగా చెప్పుకునే యుఎస్ లో కనీసం అయిదు వందల టికెట్లు అమ్ముడపోలేకపోవడం విచిత్రమే.
ఇక్కడ ప్రాక్టికల్ గా గమనించాల్సిన అంశం ఒకటుంది. అతిథి అంచనాలు అందుకోలేక ఫెయిలైన మూవీ. ఖలేజాలాగా దాంట్లో డెప్త్ కంటెంట్ ఉండదు. దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన విధానం టెక్నికల్ గా బాగున్నప్పటికీ అది కామన్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఇప్పుడేదో రీ ఎడిటింగ్, రీమిక్స్ అంటూ ప్రయోగాలు చేశారు కానీ జనం లైట్ తీసుకున్నారు. క్రమం తప్పకుండ చేసిన ప్రమోషన్లు ఉపయోగపడలేదు.
ఇదే కాదు రేపు 1 నేనొక్కడినే పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. మహేష్ బాబు చేసిందే 28 సినిమాలు. వాటిని ఇంత తక్కువ గ్యాప్ లో వరసగా రీ రిలీజులు చేసుకుంటూ పోతే ఇదే రిపీట్ అవుతుంది. కొంచెం సమయం సందర్భం చూసుకుని సంవత్సరానికి ఒకటి రెండు చేస్తే బాగుంటుంది కానీ ఇలా నెలకు ఒకటి రెండు వదిలితే ఫ్యాన్స్ కే బోర్ కొట్టడం ఖాయం. ఇటీవలే ఊసరవెల్లి, ఆంధ్రావాలా, కృష్ణ రీ రిలీజులు సైతం సరైన రెస్పాన్స్ లేక రీరిలీజ్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.
This post was last modified on May 29, 2026 6:19 pm
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత…