దర్శకుడు ఆర్జె బాలాజీ పేరు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. తెలుగులో నెగటివ్, మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ దేవుడితో ముడిపెట్టిన కమర్షియల్ ఎలిమెంట్స్ మన ఆడియన్స్ కి కూడా నచ్చడంతో ఇక్కడా విజయం సాధించడం అనూహ్యం. రెండు వందల యాభై కోట్ల మార్కుని దాటేసిన కరుప్పు / వీరభద్రుడు నెక్స్ట్ ట్రిపుల్ సెంచరీ దాటేందుకు రెడీ కావడం విశేషం. తమిళనాడులో మూడో వారం దగ్గరలోనూ స్ట్రాంగ్ గా ఉండటం బయ్యర్లను ఆనందంలో ముంచెత్తుతోంది.
ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలి. ఆర్జె బాలాజీ మొదటిసారి దర్శకుడిగా మారింది మూకుతి అమ్మన్ సినిమాతో. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. నేరుగా ఓటిటిలో రిలీజయ్యింది. మంచి పేరే తెచ్చింది. తర్వాత బాలీవుడ్ హిట్ మూవీ బాదాయీ హోని తనే హీరోగా వీట్ల విశేషం పేరుతో రీమేక్ చేస్తే డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత మూకుతి అమ్మన్ 2 తీయాలని ఆర్జె బాలాజీకి ఆఫర్ వచ్చింది. అప్పటికే సూర్యకు కమిట్ మెంట్ ఇచ్చిన ఇతను దానికి నో చెప్పాల్సి వచ్చింది.
అది మాత్రమే కాదు నయన్, అమ్మోరు తల్లి తీసిన నిర్మాతలతో బాలాజీకి విభేదాలు రావడం వల్లే సీక్వెల్ వదులుకున్నాడని చెన్నై మీడియాలో వినిపించింది. బాలాజీ నో చెప్పాక అది సుందర్ సి టేకప్ చేశారు. వంద కోట్ల బడ్జెట్ తో నయనతారతోనే తీస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే నయనతార మూవీని వద్దనుకోవడం బాలాజీకి చాలా పెద్ద మేలు చేసింది. 2026లో రెండు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చిన తొలి తమిళ దర్శకుడిగా ఘనత సాధించేశారు.
కంటెంట్, టేకింగ్ పరంగా బాలాజీ మీద విమర్శలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇతని డిమాండ్ అమాంతం పైకి వెళ్ళిపోయింది. ఎవరూ ఊహించని ఒక పెద్ద స్టార్ తో త్వరలో కాంబినేషన్ ఉండొచ్చనే తరహాలో చెన్నై లీకులు ఊరిస్తున్నాయి. రిలీజ్ రోజు కన్నీళ్లు పెట్టుకున్న బాలాజీ ఇప్పుడు ఆనందంతో గెంతులు వేస్తున్నారు. నెగటివిటీ వచ్చిన మూవీకి అనూహ్యంగా ఇంత వసూళ్లు కురవడమంటే అదో అద్భుతమేగా.
This post was last modified on May 27, 2026 2:33 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…