థియేటర్ రిలీజై రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటిదాకా దేవర సినిమా శాటిలైట్ ప్రసారానికి నోచుకోలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే కానీ ఇది అక్షరాలా నిజం. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మూవీ ఇంత కాలం సోల్డ్ అవుట్ కాకుండా ఉండదు. అయితే విడుదలకు ముందు నిర్మాతలు ఆశించిన మొత్తానికి ఆఫర్లకు మధ్య వ్యత్యాసం రావడం వల్లే ఆగిపోయిందని, లేదంటే అప్పుడే జరిగిపోయేదని అంతర్గత వర్గాల మాట.
స్టార్ మా, జీ తెలుగు, జెమిని గట్టిగానే ట్రై చేశాయి కానీ ధర దగ్గర ఏదో తిరకాసు వచ్చి ఆగిపోయారని వినికిడి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దేవర హక్కులు సొంతం చేసుకునే దిశగా ఈటీవీ ఛానల్ గట్టిగా అడుగులు వేస్తోందని తెలిసింది. భారీ రేట్ ఆఫర్ చేయకపోయినా ఉన్నంతలో ఒక డీసెంట్ మొత్తాన్ని ప్రతిపాదనగా పెట్టినట్టు సమాచారం. మరి నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరలవుతోంది.
ఈటీవీ అంటే ట్రెండింగ్ ఛానెల్ కాదని అభిమానుల అభిప్రాయం. అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు గమనించాలి. జూనియర్ ఎన్టీఆర్ ని సోలో హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసింది రామోజీరావే. ఒక దశ వరకు తారక్ సినిమాలు కొంటూ వచ్చారు. ఇప్పటికీ సింహాద్రి చూడాలంటే ఈటీవీలో టెలికాస్ట్ అయినప్పుడే ఛాన్స్ ఉంటుంది. లేదంటే తక్కువ క్వాలిటీతో యూట్యూబ్ లో చూసుకోవాలి. అల్లరి రాముడు కూడా వీళ్ళ దగ్గరే ఉంది. ఆ తర్వాత జూనియర్ సినిమాలు కొనలేదు.
ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఉంది కాబట్టి దానికి ధీటైన శాటిలైట్ ఛానల్ లో దేవర రావాలని ఫ్యాన్స్ కోరిక. ఈటీవీని మరీ తక్కువంచనా వేయడానికి లేదు. ఈ మధ్య ఓటిటిలోనే కాదు ప్రొడక్షన్ లో కూడా దూకుడు పెంచారు. కాకపోతే కొత్త సినిమాలు కొనే విషయంలో వెనుకబడి మాట కాదనలేం లేదు ఇకపై ఇదే తరహా క్రేజీ మూవీస్ సొంతం చేసుకుంటే టిఆర్పి రేటింగ్స్ కూడా పెరుగుతాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వీకెండ్ లో రావొచ్చని డిజిటల్ వర్గాల కథనం.
This post was last modified on May 26, 2026 12:59 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…